టీమిండియా రెండో వన్డేలో ఓటమి కారణంగా.. సిరీస్ కైవసం చేసుకోవాలంటే మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభంలో తడబడినా మళ్లీ పుంజుకుని .. కీలకమైన మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో 2-1తో వన్డే సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా విక్టరీలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించడంతో పాటు తన కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం అవార్డ్ అందుకునే సందర్భంలో సంజు భావోద్వేగానికి లోనై మాట్లాడాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
ఆరంభం తడబడి… వారిద్దరే చక్కదిద్దారు
దక్షిణాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన భారత్ త్వరగానే 3 వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ కుదురుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. ఈ క్రమంలో పరుగులు రాబట్టేందుకు ఎక్కువ బంతులు తీసుకోవాల్సి వచ్చింది. దీని ప్రభావం టీమిండియా రన్రేటుపై పడింది. కానీ మరో ఎండ్లో ఉన్న బ్యాటింగ్ చేస్తున్న శాంసన్ మాత్రం పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల ను ధీటుగా ఎదుర్కుంటూ బౌండరీలతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. 40 ఓవర్క్ ఉన్న మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మర్చేశారు. ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ నీ ప్రత్యర్థి ముంచు ఉంచగలిగింది.
ఇక లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా త్వరగా రెండు వికెట్లు కోల్పోయిన ఓ దశలో గెలుస్తుందని అనేలా కనిపించింది. అయితే అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. దక్షణాఫ్రికా జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాటం వృధా అయ్యింది. భారత జట్టు విజయంలో కీలకంగా మారిన శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అతనో అద్భతం… శాంసన్
అయితే సెంచరీ సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సందర్భంలో సంజు మాట్లాడుతూ… ఈ విజయం నాకు ప్రత్యేకమైనంది. ఈ మ్యాచ్లో సెంచరీ నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. భావోద్వేగంగా అనిపిస్తుంది. గత కొంత కాలంగా నేను శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడుతున్నాను. జట్టులో ఎక్సట్రా ఆల్రౌండర్ ఉన్నాడని 40 ఓవర్లపాటు బ్యాటింగ్ కొనసాగించాలని మేము ప్లాన్ చేశాము. ఇక తిలక్ వర్మ గొప్పగా ఆడాడు. ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ శైలి బాగుంది. తిలక్ నుంచి భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఇన్నింగ్స్లు మనం చూడవచ్చు. అతనో అద్భుతమైన అటగాడు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు అత్యన్నత స్థాయి ప్రమాణాలను నెలకొల్పారు. ప్రస్తుతం జూనియర్లుగా ఉన్న తాము తమ పని చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సంజు శాంసన్కు టీంఇండియాలో స్థిరమైన స్థానం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.