టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు వాడుకలోకి వచ్చాయి. బ్యాంక్ లకు వెళ్ళడం, ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు కోసం నిల్చోవడం వంటివి ఈ యాప్ ల రాకతో దూరమయ్యాయి. అందుకే కోట్లాది మంది ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారు. కొత్త సంవత్సరం రానున్న తరుణంలో మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవట. అవి ఎవంటే….
కరోనా తరువాత దేశవ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయనే చెప్పాలి. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లు అందుబాటులోకి వచ్చి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా మారాయి. టీ షాప్ , చాట్ సెంటర్ వంటి చిరు దుకాణాల దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ ఆన్లైన్ షాపింగ్ , మనీ ట్రాన్స్ఫర్ వంటి లావాదేవీలు ….యూపీఐ యాప్ ల నుంచే జరుగుతున్నాయి. ఇక చెల్లింపులే విషయంలో ఇవే అత్యధికంగా ఉంటున్నాయి
అయితే చాలా మంది కస్టమర్లు వివిధ యూపీఐ యాప్లను డౌన్లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి వాడకం మరిచిపోతున్నారు. వీటి వల్ల జరిగే దుర్వినియెగాన్ని ఆపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యూపీఐ యాప్లను ఎన్పీసీఐ కోరింది.
అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లకు ఫోన్ నంబర్ను అనుసంధానించి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్లను వాడుతున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రకారం, టెలికాం కంపెనీలు 90 రోజుల వరకు ఉపయోగించకుండా ఉన్న తమ పరిధిలోని మొబైల్ నంబర్లను డియాక్టివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం వాటిని కొత్త సబ్స్క్రైబర్లకు అందిస్తూ మళ్లీ మొబైల్ నంబర్లను వాడుకలోకి తీసుకొస్తున్నాయి.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా… కొందరు కస్టమర్లు లింక్ చేసిన ఫోన్ నంబర్లను డీలింక్ చేయకుండా వదిలేస్తున్నారు. అనంతరం కొత్త ఫోన్ నంబర్తో మార్చి లావాదేవీలు జరుపుతుంటారు. ఈ క్రమంలో పాత నంబర్ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. బ్యాంక్తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్ను యూజర్లు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుంటే.. అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు (TPAP), పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (PSP) డిసెంబర్ 31, 2023లోపు వీటిపై చర్యలు తీసుకోవాలని ఎన్పీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.