Cricket: క్రికెట్ చరిత్రలో టీ20 రాకతో చాలా మార్పులే వచ్చాయి. అటు ఆటగాళ్లుకు, ఇటు క్రికెట్ బోర్డులకు ఈ టీ20 లీగ్లు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే మరో వైపు ముఖ్యంగా ఈ పరిణామాలు టెస్టు క్రికెట్ మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాయి పలువురు సీనియర్ ఆటగాళ్లు మండిపడుతున్నారు. తాజాగా క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) టీ20 మ్యాచ్లకు ప్రాధాన్యతనిస్తూ… న్యూజిలాండ్లో జరగబోయే పర్యటన కోసం సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా మండిపడ్డాడు. సౌతాఫ్రికా బోర్డు టీ20 లీగ్ల కోసం టెస్ట్ క్రికెట్ను చంపే కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణలు చేశాడు.
టెస్టు క్రికెట్ను చంపేస్తారా
వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు-టెస్టుల సిరీస్ కోసం, క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) రెండవ-శ్రేణి టెస్ట్ జట్టును ప్రకటించింది, ఇందులో కొత్త కెప్టెన్తో సహా ఏడుగురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ పరిణామాలను పరిశీలించిన స్టీవా అవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)తో సహా ఇతర అగ్ర క్రికెట్ బోర్డులు అంతిమంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆసీస్ దిగ్గజ కెప్టెన్ తీవ్రంగా విమర్శించారు.
స్వదేశంలో జరిగే లీగ్లు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే కివీస్తో సిరీస్ను మొత్తంగా రద్దు చేసుకోవచ్చని చురకలంటించాడు. ఈ పరిణామాలు చూస్తుంటే సఫారీలు టెస్ట్ క్రికెట్ను చులకన చేసిందని మండిపడ్డాడు. ఇంత జరుగుతున్నా ఈ విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించినందుకు ఐసీసీ సహా బీసీసీఐపై కూడా మండిపడ్డాడు.
అసలు స్టోరీ ఏంటేంటే..
సీఎస్ఏ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పెట్టుబడిదారులు ప్రారంభించిన సౌతాఫ్రికా టీ20 రెండవ సీజన్, T20 లీగ్లో ఆడటానికి అగ్రశ్రేణి దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఒప్పందం చేసుకున్నారు. అయితే న్యూజీల్యాండ్ టెస్ట్ టూర్, టీ20 లీగ్ ఒకే . అందుకే, టెస్టుల కంటే టీ20 క్రికెట్కు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తన ఆవేదనను ఇన్స్టాలో షేర్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ కంటే దక్షిణాఫ్రికా తన దేశవాళీ టీ20 లీగ్కు ప్రాధాన్యత ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, తమ అత్యుత్తమ ఆటగాళ్లతో లీగ్ను ఆడించడం కోసం… ఇదే తరహాలో జట్టును ఆస్ట్రేలియాకు పంపడం.. అక్కడ జరిగిన వన్డే సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఇదే తరహాలో పాకిస్తాన్, వెస్టిండీస్ అనుసరిస్తున్నాయి. ఆయా దేశాలు తమ పూర్తి-బలమైన జట్లను టెస్ట్ సిరీస్ కోసం పూర్తి స్థాయి జట్లను ఎంపిక చేయడం లేదు. వెస్టిండీస్ తమ పూర్తి స్థాయి జట్టును (ఈ వేసవిలో ఆస్ట్రేలియాకు) పంపడం లేదు. వారు ఇప్పుడు రెండేళ్లుగా పూర్తి స్థాయి టెస్ట్ జట్టును ఎంచుకోలేదు.
“నికోలస్ పూరన్ లాంటి వ్యక్తి నిజంగా టెస్ట్ క్రికెట్ ఆడని టెస్ట్ బ్యాట్స్మన్. బహుశా వారి అత్యుత్తమ ఆటగాడు జాసన్ హోల్డర్ ఇప్పుడు ఆడటం లేదు. పాకిస్థాన్ కూడా పూర్తి జట్టును (ఆస్ట్రేలియాకు) పంపలేదని మండిపడ్డాడు. ఇలాంటివి భవిష్యత్తులో టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు స్టీవ్ వా.