శ్రమ, పట్టుదల, ధైర్యం లాంటివి ఉంటే ఏదైనా సాధించగలం. ఈ వాక్యాన్ని నిరూపిస్తూ తాజాగా ఓ మహిళ అందరూ అవాక్కయ్యేలా గడ్డితో వ్యాపారాన్ని మొదలు పెట్టి .. అందులో కోట్ల టర్నోవర్ చేస్తుంది. పాయల్నాథ్ అందరి లానే గడ్డితో ఏం చేస్తాం అని సాదాసీదాగా ఆలోచించి ఉంటే.. ఈ విజయాన్ని అందుకునేది కాదు. ఆమె విభిన్నమైన దృక్పథం వల్ల ఈ వ్యాపారం ఊపిరి పోసుకుంది. వాస్తవానికి దేశంలో గడ్డి భూములే లభ్యత ఉంది. ఈ విషయాన్ని పాయల్ గుర్తించి ఈ రంగాన్ని ఎంచుకుంది. అసలు ఇంతటి విజయాన్ని ఎలా చేరుకుందంటే…
85 శాతం మంది మహిళలే
2006లో, పాయల్ కదమ్ ఫౌండేషన్ను స్థాపించింది. ఇందులో 10,000 మంది కళాకారులకు గడ్డిని ఉపయోగించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసేలా ఇందులో శిక్షణనిచ్చింది. ఇందులో మరో విషయం ఏంటంటే.. చేతి వృత్తులవారిలో 85 శాతం మంది మహిళలే ఉండడం. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే క్రమంలో తొలుత పాయల్, ఆమె సోదరి కలిసి బోటిక్ స్టోర్ ఆరంభించారు. అక్కడే గడ్డి ఉత్పత్తులను విక్రయించేవారు. ఆ తర్వాత వాటి మార్కెటింగ్ కోసం 2009లో కోల్కతాలో కదమ్ హాత్ను ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో గడ్డి ఉత్పత్తులకు ఎనలేని గిరాకీ లభించింది. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ తర్వాత 2022 లో బ్రాండ్ కదమ్ హాట్ బాస్కెట్రీ బార్న్ ప్రైవేట్ లిమిటెడ్ (KHBBPL)గా పునఃప్రారంభించింది.
కదమ్ హాట్ సంబంధిత ఈ కొత్త వెర్షన్ మొదటి సంవత్సరంలో దాదాపు రూ. 2 కోట్ల వార్షిక రాబడిని సాధించింది. 2023-24లో ఇది 2.5 రెట్లు మెరుగ్గా ( రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేలా) అంచనా వేస్తున్నట్లు పాయల్ చెప్పింది. ఈ క్రాఫ్ట్లలో, హస్తకళాకారులు అత్యంత పేదవారు కూడా పని చేస్తున్నట్లు ఆమె తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి ఫైబర్క్రాఫ్ట్ బ్రాండ్ను నిర్మిస్తున్న ఆమె, ఇది త్వరలో ప్రపంచవ్యాప్తంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది పాయల్.
చిన్నతనంలోనే ఎన్నో సవాళ్లు
“నా తండ్రి ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్లో ఉన్నారు.ఆయన నాకు ఓపెన్ మైండ్స్ కలిగి ఉండాలని నేర్పించారు. ప్రతి సాయంత్రం రాత్రి భోజనం తర్వాత ఫిలాసపీ, రాజకీయాల నుంచి ఆహారం వరకు వివిధ అంశాలను చర్చించడం మా కుటుంబ ఆచారం. ప్రపంచంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వాటిని సరిగా ఉపయోగించుకుంటే జీవితంలో అనుకున్నవి సాధించవచ్చని మా తల్లిదండ్రులు నేర్పేవారు. వీటితో పాటు మేము తరచుగా ఇళ్లు మారేవాళ్లం. అలా జరిగిన ప్రతి సారీ కొత్త ప్రదేశాలు అక్కడ ఎదురయ్యే సవాళ్లు.. వాటిని ఎదుర్కోవడం అనేది నాకు అలవాటుగా మారిందని “ పాయల్ తెలిపింది.
అనంతరం తన విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ.. “నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివాను. ఫుట్వేర్ ( పాదరక్షలు) రంగంలో సైన్స్ లో ఆసక్తి ఉండేది. అందుకే ఫుట్వేర్ డిజైన్, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో స్వల్పకాలిక కోర్సు చేశాను. దాదాపు రెండేళ్లపాటు ఫుట్వేర్ డిజైనర్గా పనిచేశాను. ఉత్పత్తి రూపకల్పన గురించి మాత్రమే కాకుండా వాటి ప్రక్రియలను కూడా నేర్చుకున్నాను. ఈ నైపుణ్యాలు, అనుభవం ప్రస్తుతం తన పనికి దోహదపడుతున్నట్లు “ చెప్పుకొచ్చింది.