Actress Meena: ప్రస్తుత రోజుల్లో టాప్ హీరోయిన్ అంటే కేవలం నాలుగైదు సినిమాలు లేదా ఒకటి రెండు సంవత్సరాల మాత్రమే ఒకరి పేరు వినిపిస్తుంది. అయితే 90 వ దశకంలో అలా కాదు.. టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదిస్తే కొంత కాలం పాటు ఆ ట్యాగ్ని కొనసాగించేవారు. అలాంటి టాప్ హీరోయిన్ల జాబితాలో మీనా ఒకరు.
కోలివుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, టాలీవుడ్ ఇలా సౌతిండియా మొత్తం ఈ అమ్మడు చుట్టేసింది. అయితే బోల్డ్ సన్నివేశాల్లో మాత్రం నటించేందుకు ఇష్టపడేది కాదు. అందుకే అలాంటి సీన్లు ఉన్నా దర్శక, నిర్మాతలకు కుదరదని కచ్చితంగా చెప్పేది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన నిర్ణయం వెనుక గల కారణాలను వెల్లడించింది.
చైల్డ్ ఆర్టిస్ట్గా అదరగొట్టింది
మీనా చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలో ఆరంగేట్రం చేసింది . 1982లో శివాజీ గణేశన్ నటించిన తమిళ్ సినిమా ‘నెంజంగల్’ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. అయితే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా చిన్న వయసులోనే తన అద్భుతమైన నటనతో అందరి చేత శభాష్ అనిపించుకుంది.
ముఖ్యంగా నవయుగం, ఎన్ రసవిన్ మనసిలే, సాంత్వనం, రాజేశ్వరి కళ్యాణం, చంటి, వీర, ముత్తు వంటి హిట్లతో మంచి పేరు సంపాదించుకుంది. హీరోయిన్గా తన కెరీర్ సాఫీగా సాగుతున్నప్పటికీ.. ఎందుకో గానీ మీనా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో ఈ అంశంపై అప్పట్లో ఇండస్ట్రీలో నిరంతరం చర్చ కూడా జరిగేది. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందిస్తూ సమాధానమిచ్చింది. ( దీనిపై ఓ లుక్కేయండి: రాజమౌళి-మహేశ్ మూవీ.. అందులో నిజం లేదు, అవి పుకార్లు మాత్రమే! )
అదే కారణం.. అందుకే బోల్డ్ సీన్లు చేయను
నివేదికల ప్రకారం.. ఒకసారి ప్రభుదేవా మీనా వద్దకి వచ్చి బోల్డ్, గ్లామరస్ పాత్రల్లో కూడా నటించాలని సలహా ఇచ్చాడట. అయితే ఆమెకు సిగ్గు, భయం ఎక్కువగా ఉండేదని, ఆ కారణంగా బోల్డ్ పాత్రలు చేసేందుకు ఇబ్బందిపడేదట. మేకప్ రూమ్ నుంచి స్విమ్మింగ్ డ్రెస్ ధరించి బయటకు వచ్చేందుకు కూడా తన ధైర్యం సరిపోయేది కాదని.. అలా తన అసౌకర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని చెప్పుకొచ్చింది. అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సరసన నటించి హిట్లు అందుకున్న మీనా.. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది.
అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఆమె భర్త విద్యాసాగర్ 2022 జూన్లో చనిపోయారు. మీనాకు ఒక కూతురు ఉండగా.. ఆ చిన్నారి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.చాలా కాలం తరువాత మలయాళంలో మోహన్లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమాతో మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టాలీవుడ్లో వెంకటేష్ ఈ సినిమా రీమేక్ చేయగా.. ఇందులోనూ మీనా నటించింది. ఈ చిత్రంలో విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్కు ప్లస్ అయ్యిందని చెప్పాలి.
ఇటీవల ఆమె.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన బ్రో డాడీలో నటించింది. మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. OTT ప్లాట్ఫారమ్ డిస్నీ+ హాట్స్టార్లో విడుదలైన ఈ చిత్రం ఆకర్షణీయమైన కథాంశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రౌడీ బేబీ, ఆనందపురం డైరీస్లో నటిస్తోంది. విభిన్న కథలు, పాత్రల ఎంపిక విషయంలో రాజీ పడకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా సాఫీగా సాగిస్తోంది మీనా.