India vs England: ఉప్పల్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో తొలి టెస్ట్ మూడవ రోజు ఇండియా 436 పరుగులతో ఆలౌట్ అయ్యింది. టీమిండియా స్వల్ప వ్యవధిలోనే చివరి వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఓ వైపు 436 పరుగులతో భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఓవర్ నైట్ స్కోర్ 421/7 తో ప్రారంభమైన మ్యాచ్… మూడో రోజు కేవలం 15 పరుగులు మాత్రం భారత బ్యాటర్లు రాబట్టారు. ఓవర్ నైట్ భారీ స్కోర్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత జట్టుకు జో రూట్ ఊహించని షాక్ ఇచ్చాడు.
రవీంద్ర జడేజా సెంచరీ కొడతాడు అని అంతా అనుకున్న.. ఆ అంచనాలను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి తారుమారు చేశాడు. అయితే జడేజా అవుట్ అనుమానాస్పదంగా మారింది. రీప్లైలో ప్యాడ్ కన్నా ముందే బ్యాట్ తాగినట్లు కనపడినప్పటికీ, అంపైర్ అవుట్ అని ప్రకటించడంతో జడేజా అద్భుత ఇన్నింగ్స్ కు తెరపడింది. అయితే ఈ మ్యాచ్లో భారత క్రికెట్ చరిత్రలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
ఒకే సారి ముగ్గురు
తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించడానికి టీమిండియా (Team india) బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. వీరు ముగ్గురు 80కు పైగా పరుగులు తీశారు. ఒకానొక తరుణంలో ఈ ముగ్గురు ప్లేయర్స్ సెంచరీ సాధించేటట్లు కనిపించినప్పటికీ, ఏ ఒక్కరు కూడా సెంచరీని చేరుకోకుండానే అవుట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ 10 ఫోర్లు-3 సిక్స్ లతో74 బంతుల్లో 80 పరుగులు తీయగా.. మరోవైపు రాహుల్ 8 ఫోర్లు- 2 సిక్స్ లతో 123 బంతుల్లో 86 పరుగులు తీశాడు.
(( దీనిపై ఓ లుక్కేయండి :ఊహించని షాక్.. ఒకేసారి నలుగురు విండీస్ క్రికెటర్లు రిటైర్మెంట్! ))
ఇకపోతే 180 బంతులు ఎదుర్కొన్న జడేజా 7 ఫ్లోర్లు- 2 సిక్స్ లతో 87 పరుగులు సాధించాడు. వీరి ముగ్గురు కూడా 80 పైగా స్కోర్ లో అవుట్ కావడంతో.. టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును నమోదైంది. 92 ఏళ్ల భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేసిన ఆటగాళ్లుగా సరికొత్త రికార్డును నమోదు చేశారు.
ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా
రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులు సాధించారు. మూడవరోజు అక్షర్ పటేల్, జడేజాతో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అప్పటికే 112 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 423 పరుగులతో భారత్ ఉండగా.. 118 ఓవర్ ఆరో బాల్ కు అక్షర్ ఒక బౌండరీ దాటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పెషలిస్ట్ బౌలర్ కంటే పార్ట్ టైం బౌలర్ అయిన జో రూట్ బ్రహ్మాండంగా అదరగొట్టాడు.
భారత తొలి ఇన్నింగ్స్ లో చివరిలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లను తీశాడు.. దీంతో మొత్తం నాలుగు వికెట్లతో ఇంగ్లండ్కు మ్యాచ్పై ఆశలు సజీవంగా నిలిపాడనే చెప్పాలి., టామ్ హార్ట్లీ-2, రెహాన్ అహ్మద్-2, జాక్ లీచ్-1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగుల తీయగా.. టీమిండియా 436 రన్స్ చేసింది.