Rohit Sharma: టీమిండియా రెండో టెస్టులో విజయం సాధించి బోణి కొట్టడంతో పాటు ఉప్పల్లో ఎదురైనా ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాటింగ్ అనంతరం ఇంగ్లాండ్కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 316 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆటను ప్రత్యర్థి బ్యాటర్లు ప్రారంభించారు. అయితే భారత జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్తో పాటు పటిష్టమైన ఫీల్డింగ్తో ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయంలో ఫీల్డింగ్ పరంగా అద్భతమైన ప్రదర్శనను భారత్ కనబరచగా.. అందులో మఖ్యమైనది ఏంటంటే..
క్యాచ్తో మ్యాచ్ మలుపు..
ఉప్పల్ టెస్టులో ఎదురైన పరాభవానికి వైజాగ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆల్రౌండర్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ను చిత్తుచిత్తుగా ఓడించింది. నాలుగో రోజు భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి జట్టు రెండో ఇన్నింగ్స్ లో 292 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపులో రోహిత్ శర్మ (Rohit Sharma) క్యాచ్ కీలక మలుపు తిప్పిందనే చెప్పాలి.
((దీనిపై ఓ లుక్కేయండి: ఆట కాదు,నా అందంపైనే వాళ్ల ఫోకస్.. మండిపడ్డ చెస్ ప్లేయర్))
కనురెప్ప పాటులోనే..
స్పిన్ బౌలింగ్తో అశ్విన్ అదరహో అనిపించాడు. ఈ స్పిన్నర్ వేసిన బౌలింగ్లో ఓలీ పోప్ ఔట్ అయ్యాడు. ఓలీ డిఫెన్స్ ఆడే క్రమంలో బాల్ కాస్త బ్యాట్ కు తగిలి స్లిప్ పై నుండి బౌండరీ వెళ్లేలా ప్రయత్నం జరిగింది. స్లిప్ ఫీల్డింగ్లో ఉన్న కెప్టెన్ రోహిత్ కను రెప్పపాటులో క్యాచ్ పట్టుకున్నాడు.ఈ క్యాచ్ అందుకోవడానికి రోహిత్ కేవలం అర సెకన్ కంటే తక్కువ సమయం తీసుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పిందనే చెప్పాలి.. ఎందుకంటే తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుపుకి ఓలీ పోప్ ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఈ క్యాచ్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం రోహిత్ క్యాచ్ పట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇకపై ఇలాంటి క్యాచ్ లు మరెన్నో..
అశ్విన్ బౌలింగ్ లో ఓలీ పోప్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసి పట్టాడు. కేవలం 0.45 సెకండ్లలోనే రోహిత్ రియాక్ట్ అయ్యి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ గురించి తాజాగా రోహిత్ శర్మ స్పందించాడు. స్లిప్ లో ఉండే ఫీల్డర్లు ఎప్పుడూ ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండాల్సి ఉంటుందని.. కనురెప్పపాటులోనే రియాక్ట్ కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఓలీ పోప్ ఇంగ్లాండ్ కు చాలా కీలక బ్యాట్స్ మెన్ అయినప్పటికీ క్యాచ్ పట్టడం చాలా ఆనందం కలిగిందని రోహిత్ అన్నాడు.
అంతేకాకుండా ఇకపై ఇలాంటి క్యాచ్ లు ఎన్ని వచ్చినా పడతానంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ క్యాచ్ ను చూసి అభిమానులు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండు పై అత్యధిక వికెట్లు (96) తీసిన బౌలర్గా రికార్డ్ సృష్టించాడు. రెండో టెస్టులో ఓలీ పోప్ వికెట్ తీయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ఈ రికార్డ్ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ (95 వికెట్ల) పేరిట ఉండగా, ఇప్పుడు దానిని అశ్విన్ బద్దలు కొట్టాడు.