Indian Railways: భారతదేశంలో ప్రతిరోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రజల అవసరాలు, సరుకుల రవాణా కోసం ఇండియన్ రైల్వేస్ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతుంటుంది. రైలులో ప్రయాణం అంటే టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం సహజంగా జరిగే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ పొడవుగా ఉండడమో, లేదా టికెట్ కొనే సమయం లేకపోవడం కారణం వల్ల కొందరు టికెట్ లేకుండానే రైలులో ప్రయాణిస్తూ ఉంటారు.
అయితే ఏది ఏమైనా టికెట్ లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరం. అలా అని టీటీ (టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్) చేతికి చిక్కి వేలకు వేల రూపాయలు సమర్పించడం ,లేదా టికెట్ లేని ప్యాసింజర్పై చేయి చేసుకుని అధికారం లేదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
((దీనిపై ఓ లుక్కేయండి: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంపు.. కొత్త తేది ఏదంటే! ))
దురుసుగా ప్రవర్తించకూడదు..
రోజూ కొన్ని లక్షల మంది ప్యాసింజర్లు రైళ్లోలో ప్రయాణిస్తుంటారు. వీరిలో కొందరు ట్రైన్ టికెట్ లేకుండా ప్రయాణించే సందర్భం వస్తుంది. ఈ క్రమంలో కొందరు టీటీ అధికారులు దురుసుగా సదరు ప్రయాణికులపై ప్రవర్తిస్తుంటారు. ఇటీవల లక్నో నుంచి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడని లక్నో ఎక్స్ప్రెస్లో.. ఓ రైల్వే అధికారి ప్రయాణికునిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీటీ దురుసు ప్రవర్తనకు అతన్ని ఉద్యోగంలో నుంచే సస్పెండ్ చేసింది రైల్వే శాఖ(Indian Railways). అసలు మీ వద్ద టికెట్ లేకపోతే ఈ పనులు చేయడం ద్వారా ట్రైన్లో మీకు ఎటువంటి ఇబ్బందులను కలగకుండా చూడవచ్చు.
ఇలా చేస్తే సరిపోతుంది..
మొదటగా.. టికెట్ లేని ప్రయాణికులు టీటీని సంప్రదించి.. మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. అంటే మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన ప్రదేశానికి అయే టికెట్ ధరతో పాటు.. కేవలం 250 రూపాయల జరిమానా విధిస్తారు. మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి వెళ్లే చార్జీలు చెల్లింపుతో పాటు అదనంగా రూ. 250 కలిపి చెల్లించాల్సి ఉంటుంది. దీని అనంతరం ఒకవేళ ట్రైన్లో సీట్లు కాళీ ఉంటే సదరు వ్యక్తికి సీటును కేటాయించాల్సి ఉంటుంది.
రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ఏం చెబుతోంది..
రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణించే ప్యాసింజర్లపై జరిమానా విధించే అధికారం రైల్వే శాఖకు ఉంది. ప్రయాణికులు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లయితే, అటువంటి వారి వద్ద నుంచి రెండు మార్గాల్లో జరిమానా ఛార్జీని వసూలు చేయవచ్చు.
మొదటిది.. టికెట్ లేని ప్యాసింజర్ ప్రయాణించిన దూరానికి వసూలు చేయాలి లేదా కొన్ని సందర్బాల్లో ట్రైన్ ప్రారంభ స్టేషన్ నుంచి సదరు వ్యక్తి పట్టుబడిన ప్రదేశానికి ఛార్జీని వసూలు చేయడంతో పాటు అదనంగా రూ.250 జోడించాలి. రెండవది ట్రైన్ సాధారణ ఛార్జీని జరిమానా కింద వసూలు చేయవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే రైల్వే అధికారులు.. ఆ మొత్తాన్ని ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది.