Kulwant Khejroliya: భారత యువ క్రికెటర్, మధ్యప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కుల్వంత్ కెజ్రోలియా అరుదైన ఘనతను సాధించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఊహించని బంతులతో 4 బంతులలో 4 వికెట్లను పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్లో లెప్టార్మ్ పేసర్ ఈ ఫీట్ సాధించాడు.
4 బంతుల్లో .. 4 వికెట్లు
హోల్కర్ స్టేడియంలో ప్రత్యర్థి జట్టుపై మధ్యప్రదేశ్ ఫాలో-ఆన్ విధించింది. ఇక రంజీ ట్రోఫీ మ్యాచ్ చివరి రోజున రెండో ఇన్నింగ్స్లో 95వ ఓవర్లో లెఫ్టార్మ్ పేసర్ కేజ్రోలియా (Kulwant Khejroliya)ఈ ఘనత సాధించాడు. ఎడమచేతి వాటం పేసర్ రంజీ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన మూడవ మధ్యప్రదేశ్ బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా దేశీయ రెడ్-బాల్ పోటీలో భారత్ తరపున ఈ ఫీట్ సాధించిన 80వ ఆటగాడిగా నిలిచాడు. ఒకే ఓవర్లో రెండు, మూడు, నాలుగు, ఐదు బంతుల్లో పదనైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లును పెవిలియన్కు పంపాడు.
((దీనిపై ఓ లుక్కేయండి: ఆట కాదు,నా అందంపైనే వాళ్ల ఫోకస్.. మండిపడ్డ చెస్ ప్లేయర్))
ఈ క్రమంలో షెష్వాత్ రావత్, మహేష్ పీతియా, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్లను వరుసగా ఔట్ చేశాడు. మొదటగా షెష్వాత్ రావత్ను క్లీన్ బౌల్డ్.. మహేష్ పీతియాను స్లిప్ క్యాచ్గా..భార్గవ్ బట్ను ఎల్బీగా.. ఆకాశ్ సింగ్ను క్లీన్ బౌల్డ్ చేసి వారిని పెవిలియన్ బాటపట్టించాడు కుల్వంత్.రెండో ఇన్నింగ్స్లో కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి , మధ్యప్రదేశ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 454 పరుగుల భారీ స్కోర్ని బరోడా ముందు ఉంచింది. అనంతరం బరోడా తన తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్లో కుల్వంత్ దెబ్బకు 270 పరుగులకు ఆలౌటైంది.
ఢిల్లీకి చెందిన శంకర్ సైనీ (1988లో హిమాచల్ప్రదేశ్పై), జమ్మూ-కాశ్మీర్కు చెందిన మహ్మద్ ముదాసిర్ (2018లో రాజస్థాన్పై) సహా గతంలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు. కుల్వంత్ బౌలింగ్ని మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ప్రశంసించాడు. “ఇది అరుదైన ఫీట్. ఒక బౌలర్ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడం తరచుగా జరగదని కితాబిచ్చాడు. ఆరు మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్కు ఇది మూడో విజయం కాగా ఎలైట్ గ్రూప్ డీ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఇండోర్లో జరగనున్న జమ్మూ కాశ్మీర్తో మధ్యప్రదేశ్ తలపడనుంది.
4⃣ in 4⃣! 🔥
Kulwant Khejroliya scalped 4 wickets in 4 balls en route to his five-wicket haul to help Madhya Pradesh beat Baroda in Indore.
Relive the four wickets 🔽@IDFCFIRSTBank | #RanjiTrophy
Scorecard ▶️ https://t.co/6bvps90cWn pic.twitter.com/gk0QQFRjUe
— BCCI Domestic (@BCCIdomestic) February 12, 2024