PM Narendra Modi Announces Rs 100 Cut In Lpg Cylinder: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు భారీ కానుకను ప్రకటించారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ద్వారా ఈ ప్రకటన చేశారు. తాజాగా తగ్గించిన ధరల వల్ల కొన్ని కోట్లమంది ప్రయోజనం పొందనున్నారు. నిత్యావసర ధరలు రోజు రోజుకి అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడం సామాన్య ప్రజలకు కాస్త ఊరటనిస్తుందనే చెప్పాలి.
దీనిపై ఓ లుక్కేయండి: రూ. 100 నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్.. సుహాస్ అదిరిపోయే రిప్లై!
భారీ కానుక
ఎక్స్లో మోదీ ఈ రకంగా పోస్ట్ చేశారు. అందులో “ మహిళా దినోత్సవం సందర్భంగా, మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ. 100 తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా “వంట గ్యాస్ను మరింత సరసమైన ధరలకు అందించడం ద్వారా, వారి కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి మా నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.
ఉజ్వల యోజన ఉన్నవారికి…
ఉజ్వల యోజన కింద నమోదు చేసుకున్న ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఎల్పీజీ సిలిండర్పై రూ. 300 సబ్సిడీని కొనసాగిస్తున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది, ఇది రాబోయే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. గత అక్టోబర్లో ప్రభుత్వం 14.2 కేజీల సిలిండర్పై ఏడాదికి గరిష్టంగా 12 రీఫిల్లకు ఇచ్చే సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది.
గతేడాది రక్షాబంధన్ కానుకగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.200 తగ్గించగా.. ఈ ఏడాది మహిళా దినోత్సవం కానుకగా సిలిండర పై రూ.100 మేర తగ్గించడంతో పలువరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.