గతంలో టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే గుర్తొచ్చే జంట నాగచైతన్య సమంత. అయితే ఈ జంట విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిపోయింది. వీరికి సంబంధించిన రూమర్ మాత్రం ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే ఈ జంట ఉన్నట్టుండి ఎందుకు విడిపోయారా అంటూ ఇప్పటికీ ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు.
((దీనిపై ఓ లుక్కేయండి: Oscars 2024: అదంతా ఫేక్ అవార్డ్స్ షో .. సంచలన వ్యాఖ్యలు చేసిన బీటౌన్ బ్యూటీ ))
ఏదేమైనా మళ్లీ వీరిద్దరిని కలిసి ఎప్పుడు చూస్తామా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఎట్టకేలకు వారి కల నిజమైంది. విడాకుల తర్వాత సమంత చైతన్య ఇద్దరు ఒకే వేదికలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అసలు వీళ్లు ఎక్కడ కలిశారు ? ఆ విషయాలు చూద్దాం..
మొదట్లో అంతా బాగానే ఉంది..
ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య ఇద్దరు వారి దాంపత్య జీవితంలో ఎంతో హ్యాపీగా ఉన్నారు. అయితే వారి మధ్య ఏంజరిగిందో ఏమో సడన్గా 2022 లో తాము విడిపోతున్నట్టు ప్రకటించి పెద్ద బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం వీళ్లిద్దరూ కలసి కనిపించిన దాఖలాలే లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల సమంత అనారోగ్య సమస్యతో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో సామ్ ను చూసేందుకు చై వస్తారని, వీరిద్దరూ కలుస్తారని చాలా మంది వారి అభిమానులు భావించారు. అయితే వారి ఆశ నిరాశగా మిగిలింది.
తలుక్కున మెరిసిన జంట
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సంబంధించిన ఈమెంట్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. త్వరలో ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోయే 70 ఆసక్తికరమైన వెబ్ సిరీలు, షోలను ఈవెంట్ లో ప్రకటించారు. దీనికి దక్షణాది నుంచి చాలామంది దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరో హీరోయిన్లు హాజరయ్యారు.
ఈవెంట్కు అందుకోసమే వచ్చారు
గత ఏడాది దూత వెబ్ సిరీస్ తో నాగచైతన్య సినిమాలతోనే కాకుండా ఓటీటీలోకి అడుగు పెట్టారు. దూత వెబ్ సిరీస్ తో సినీ ప్రేక్షకులతోపాటు విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ దూత – 2 తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పనిలో బిజీగా ఉన్న నాగచైతన్య ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈవెంట్ కు డైరెక్టర్ విక్రమ్ కుమార్, నిర్మాత శరత్ మరార్ లతో కలిసి హాజరయ్యారు. దూత-2 రాబోతుందని హింట్ ఇవ్వడంతో పాటు అమెజాన్ తెలుగు ఒరిజినల్ సిరీస్ లలో మోస్ట్ సక్సెస్ ఫుల్ షో గా నిలిచిందని కూడా ప్రకటించారు.
అమెజాన్ ప్రైమ్లో రాబోతున్నసిటాడెల్ వెబ్ సిరీస్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఎప్పుడో అమెజాన్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడింది. త్వరలో రానున్న ఈ సీరిస్ ప్రమోషన్స్లో భాగంగా.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, దర్శక ద్వయం రాజ్, డీకే లతో కలిసి సామ్ ఈ కార్యక్రమానికి హాజరైంది.
ఇలా చై – సామ్ ఇద్దరూ కూడా అనుకోకుండా ఈ కార్యక్రమానికి హాజరై.. ఒకే వేదికను పంచుకున్నారు. ఇందులో వారు నటించిన వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసుకున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ను హోస్ట్ చేసిన బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ వీళ్లిద్దరినీ వేర్వేరుగా స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఈ రకంగా చై సామ్ ఒకేసారి వేదికను పంచుకున్నారు. విడాకుల అనంతరం తొలిసారి ఒకే స్టేజిని పంచుకోవడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్గా మారింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
అది జరిగిందా
ఇదిలా ఉండగా గతంలో చైతన్య తన మాజీ భార్య కనిపిస్తే హాయ్ చెప్పి, హగ్ చేసుకుంటానని అన్నాడు. ఇన్నాళ్లకు ఆ మాటకు తగ్గట్టుగా మాజీ కపుల్స్ ఒకే ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో ఒకరికొకరు ఎదురుపడ్డారా ? ఎదురుపడితే ఏం మాట్లాడుకున్నారు ? మళ్లీ వీరిద్దరూ కలిసే ఛాన్స్ ఉందా ? అని నెట్టిజల్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
our homegrown spy 🔎 #SamanthaRuthPrabhu #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Cd8U5RE5df
— prime video IN (@PrimeVideoIN) March 19, 2024