Kaliyugam Pattanamlo Movie Review in Telugu: సరికొత్త కథాంశం. ఎంగేజింగ్థ్రిల్లర్గా రూపొందించి చిత్రం కలియగం పట్టణంలో. ఇందులో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి స్టోరీ, మాటలు ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలను రమాకాంత్ రెడ్డి నిర్వహించగా.. నిర్మాతలుగా డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు వ్యవహరించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందిన కలియుగం పట్టణంలో మూవీ మార్చి 29 థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎంత మేరకు నచ్చింది అనేది చూద్దాం.
కథ
నంద్యాలలో మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి).. వారికి కవల పిల్లలతో హాయిగా నివసిస్తుంటారు. అందులో విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( ఈ పాత్ర కూడా విశ్వ కార్తికేయ నటించాడు). విజయ్ రక్తం చూసి భయపడితే.. సాగర్ మాత్రం రక్తం చూస్తే సైకోలా సంతోషిస్తాడు. దీంతో సాగర్ మెంటాలిటికి భయపడి అతని సమాజంలో తిరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉందని భావించి బాల్యంలోనే మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి.
మరో పాత్ర అయిన విజయ్ క్యారెక్టర్ పరిచయం అవుతుంది. అతను చదువుతున్న కాలేజీలో శ్రావణి (ఆయుషి పటేల్).. విజయ్ని ఇష్టపడుతుంది. అత్యాచారాలు చేసే మృగాలను శ్రావణి వేటాడి చంపుతూ ఉంటుంది. నంద్యాలలో జరిగే ఈ ఘోరాలను అడ్డుకునే పనిలో ఓ పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) ఆ ప్రాంతానికి వస్తుంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీస్ అధికారి ఏం కనిపెట్టింది. ? అసలు విజయ.. సాగర్ లలో మంచి వాడు ఎవరు.. చెడ్డ వాడు ఎవరు.. అక్కడ జరుగుతున్న ఘోరాలతో వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీస్ ఆఫీసర్ అక్కడి క్రైం కి ఫుల్స్టాప్ పెట్టిందా లేదా అన్నదే ఈ సినిమా స్టోరీ.
((దీనిపై ఓ లుక్కేయండి: విడాకుల తర్వాత మొదటిసారి స్టేజి మీద చై-సామ్! ))
ఎవరు ఎలా చేశారు (Kaliyugam Pattanam Lo)
విజయ్, సాగర్ పాత్రల్లో .. క్యారెక్టర్కు తగ్గ వ్యత్యాసాన్ని చూపించాడు విశ్వ. ఓ పాత్రలో మంచి వాడిగా, మరో పాత్రలో సైకో వాడిలా నటించి మెప్పించాడు. ఇక ప్రత్యేకంగా కొన్ని సీన్లలో భయపెట్టాడు కూడా. యాక్షన్, ఏమోషన్స్ ఇలా అన్ని కోణాల్లోనూ ఆకట్టుకుంటాడు. ఆయుషి పటేల్ ఫస్ట్ హాఫ్ లో మెప్పిస్తుంది. చిత్రా శుక్లా సెకండ్ హాఫ్ లో ఆకట్టుకుంటుంది. ఇక నరేన్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్లతో పాటు మిగిలిన పాత్రలు ఫర్వాలేదని అనిపించాయి.
విశ్లేషణ
డైరెక్టర్ ఈ మూవీ కోసం మంచి పాయింట్, స్టోరీ ఎంచుకున్నాడు. నేరాలను ఇలా కూడా చేయొచ్చా? అనే భయం కలిగించేలా చిత్రంలో సంఘటనలను చూపించాడు. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్కు కాస్త ఆసక్తి కలిగించేలా ఉంటుందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతో నిండి పోయింది. వాటికి సమాధానాలు సెకండ్ హాఫ్ లో వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్.
ఫస్ట్ హాఫ్లో ఈ మూవీ ఉన్నంత ఆసక్తికరంగా.. ద్వితీయార్థంలో కనిపించకపోవచ్చు. కానీ ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ఆడియన్స్ ఇవి కాస్త ఎంగేజ్ చేస్తాయి. ఇక మూవీ చివరిలో వచ్చే ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. ముఖ్యంగా కలియగం పట్టణంలో తల్లిదండ్రులు తమ పిల్లలన్ని ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు.. పెంపకం అనేది సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు.
టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుందనే చెప్పాలి. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. కథకు తగ్గట్టు ఈ సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది.