Cannes Film Festival: ప్రతిష్టాత్మక క్రేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత క్రేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టాప్ కాంపిటీషన్స్ స్లాట్ లో భారతీయ సినిమా పోటీగా నిలిచింది. దర్శకురాలు- రచయిత అయిన పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఈ అరుదైన అవకాశం దక్కించుకుంది.
మరోసారి వాయిదా పడ్డ కల్కి.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ఈ విషయాన్ని స్వయంగా పారిస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈవెంట్ అధ్యక్షుడు ఐరిస్ నో బ్లొచ్ జనరల్ డెలికేట్ థియరీ ఫ్రీ మ్యాక్స్ ప్రకటించారు. ఈ వేడుకలు (Cannes Film Festival) మే 14 నుంచి 25 వరకు అట్టహాసంగా జరగనున్నాయి. మే 14న క్వెంటిన్ డుపియక్స్ ‘ది సెకండ్ యాక్ట్’తో ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది.
నలుగురు మహిళా దర్శకుల్లో ఒకరిగా..
గతేడాది ఏడుగురు మహిళా దర్శకులు ఈ పోటీల్లో నిలిచారు. కపాడియా ఈ ఈవెంట్కి కొత్తేమి కాదు. పాయల్ కపాడియా డ్యాకుమెంటరీ ఏ నైట్ ఆఫ్ నాట్ నాట్ నోయింగ్ నథింగ్ 2021 ఎడిషన్ డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్ లో ఉత్తమ డాక్యుమెంటరీ ప్లే చేయడం కోసం గోల్డెన్ ఐ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.
30 ఏళ్ల క్రితం (1994) షాజీ ఎణ్ కరుణ్ తెరకెక్కించిన స్వహం చిత్రం క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికై అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా కపాడియా చిత్రం ఎంపికై ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం ‘సంతోష్’ కూడా ఫెస్టివల్ అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది.
క్రేన్స్ ఫెస్ట్ కు ఎంపికై..
గతంలో క్రేన్స్ ఫిల్ ఫెస్టివల్ కు ఎంపికైన భారతీయ చిత్రాలలో చేతన్ ఆనంద్, వి శాంతారాం, రాజ్ కపూర్, సత్యజిత్ రే, మృనాల్ సేన్ పలువురి రచనలు ఉన్నాయి. ‘నీచా నగర’ పామ్ అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించడం అరుదైన ఘనతనే చెప్పుకోవాలి.
స్టోరీ ఏంటంటే..
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో ప్రభ అనే నర్సు చుట్టు కథ తిరుగుతుంది. ప్రభ తన భర్త నుంచి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తుంటుంది. అయితే ఒకరోజు తన భర్త నుంచి ఊహించని బహుమతి అందుకుంటుంది. తను అందుకున్న గిఫ్ట్ ప్రభ జీవితాన్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది. తర్వాత ఆమె జీవితంలో ఏం జరుగుతుందనేది మూవీ స్టోరీ.