T20 World Cup 2024.. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీ వివరాలను అంతర్జాతీయ క్రికె ట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించిం ది. గత టోర్నీతో పోలిస్తే ఈసారి ప్రైజ్మనీ భారీగా పెరిగింది. ఈ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ అక్షరాల రూ. 93 కోట్లకు (11.25 మిలియన్ల అమెరికా డాలర్లు) పైమాటే. 2022 టీ20 ప్రపంచకప్లో మొత్తం ప్రైజ్మనీ రూ. 46 కోట్లతో పోలిస్తే ఈసారి డబుల్ అవ్వడం విశేషం. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు రూ.20 కోట్ల 36 లక్షలు సొం తం చేసుకోనుండగా.. రన్నరప్కు రూ. 10 కో ట్ల 64 లక్షలు దక్కనుంది. గత టోర్నీలో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ అందుకున్న ప్రైజ్మనీ రూ. 13 కోట్ల 30 లక్షలతో పోలిస్తే ఈసారి చాంపియన్కు రూ. 7 కోట్లు ఎక్కువగా అందనుంది. ఇక సెమీఫైనల్లో ఇంటిబాట పట్టే జట్లకు రూ. 6 కోట్లకు పైగా, సూపర్ లీగ్ దశకు పరిమితమయ్యే జట్లకు కూడా మంచి ప్రైజ్మనీ లభించనుంది.
నమీబియా సూపర్ విక్టరీ
మెగాటోర్నీలో భాగంగా సోమవారం జరిగిన తొలి పోరులో ఒమాన్పై నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమాన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ కాగా.. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. అందులో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా.. ఛేదనలో ఓమన్ 10 రన్స్ మాత్రమే కొట్టడంతో నమీబియా విజేతగా నిలిచింది. గ్రూప్ భాగంగా జరిగిన మ్యాచ్లో నమీబియా బౌలర్లు రాణించడంతో తొలుత ఒమాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఖాలిద్ (34) టాప్ స్కోరర్ కాగా.. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ 4, డేవిడ్ వీజ్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (45) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి. ఒమాన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. మ్యాచ్లో మూడు వికెట్లు తీయడంతో పాటు సూపర్ ఓవర్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన డేవిడ్ వీజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
శ్రీలంక 77 ఆలౌట్
బౌలర్ల హవా సాగుతున్న ప్రపంచకప్లో సఫారీల ధాటికి శ్రీలంక ఘోర పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ భాగంగా సోమవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో లంకపై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. సఫారీ పేసర్లు అన్రిచ్ నోర్జే (4/7), కగిసో రబడ (2/21) రెచ్చిపోవడంతో లంకేయులు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. కుషాల్ మెండిస్ (19), కమిండు మెండిస (11), ఏంజెలో మాథ్యూస్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. పాథుమ్ నిషాంక (3), కెప్టెన్ హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6), షనక (9) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో నోర్జే, రబడతో పాటు కేశవ్ మహరాజ్ (2/22) రాణించాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. అతి జాగ్రత్తకు పోయిన సఫారీలు 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి విజయం సాధించారు. క్వింటన్ డికాక్ (20), కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (12), స్టబ్స్ (13), హెన్రిచ్ క్లాసెన్ (19 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. సఫారీల ఇన్నింగ్స్లోనూ మూడేసి ఫోర్లు, సిక్సర్లు మాత్రమే నమోదవడం కొసమెరుపు. 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన నోర్జేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.