Kalki 2898 Ad: రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాలతో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అలాగేఈ మూవీ కోసం నటీనటులు భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపించింది చాలా తక్కువే సమయమే అయినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అందుకున్నట్లు తెలుస్తోంది.
వాళ్ల కోసమే పెళ్లి చేసుకోలేదు.. కల్కి మూవీ ప్రమోషన్స్లో ప్రభాస్
అదరగొడుతున్న మూవీ
కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల రోజు నాన్ హాలిడే అయినప్పటికీ… తొలి రోజే బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన మూవీగా రికార్డులోకి ఎక్కింది. రెండో రోజు సైతం అదే జోరును కొనసాగిస్తూరూ.107 కోట్లు వసూళు చేసింది. శని, ఆదివారం సెలవు కావడంతో మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కల్కి 2898 ఏడీ ఈ స్పీడ్ను కొనసాగిస్తే.. తొలి వారానికే దాదాపు వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవచ్చని టాక్. పైగా ఇప్పట్లో పెద్ద హీరోల చిత్రాలో దగ్గర్లో లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఈ భారీ ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించగా.. పలువురు సినీ తారలు అతిథి పాత్రల్లో మనకి కనిపిస్తారు. (Kalki 2898 Ad)
భారీగా రెమ్యునరేషన్ అందుకున్న కమల్
ఇందులో విలన్గా కమల్ హాసన్ కనిపించారు. ఈ పార్ట్లో ఆయన పాత్ర కేవలం మూడు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే మొదటి భాగంలో కమల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ రెండో భాగంలో విలన్ పాత్ర ఆధారంగా కథ ఉంటుందని.. ఈ మూవీ చివరిలో తెలుస్తోంది. కమల్ రోల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని అర్థమవుతుంది. మొదటి పార్ట్ లో ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ పారితోషకం మాత్రం భారీగానే అందుకున్నట్లు టాక్ నడుస్తోంది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటించేందుకు కమల్హాసన్కు 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్త ప్రచారంలో ఉంది. ఇందులో ఆయన కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్రమే ఆడియన్స్కు కనిపిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కమల్ ప్రతినాయకుడిగా పోషించాలంటే ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే రీసెంట్గా నిర్మాత అశ్వినీదత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా దాదాపు 60శాతం పూర్తయిందని అంటున్నారు. మరి రెండో భాగానికి కావాల్సినంత హైప్ వచ్చేసిందనే చెప్పాలి.