Health Tips: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మన అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. అందులో ప్రధానంగా మన తినే ఆహారం అనే చెప్పాలి. అత్యధిక ప్రజలు మంచి నీళ్ల కంటే కూల్ డ్రింక్స్ తాగడం అలవాటుగా మారింది. ఇక బయట దొరికే చిరుతిండి మీద తిండి కంటే ఎక్కువగా చిప్స్ ను తినడం అలవాటైపోయింది. అంతేకాకుండా ఏదైనా పార్టీ అయినా, సినిమా అయినా, టైం పాస్ అయినా, దూర ప్రయాణానికైనా, బంధువులు వచ్చినా సరే ఈజీ టు క్యారీ, టేస్టీ బయట ఫుడ్ వెంటపడుతుంటారు.
ప్రత్యేకించి కూల్డ్రింక్స్ గ్లాసులు లేపేస్తుంటారు. ఇది మన ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని మీకు తెలుసా? కేవలం చిప్స్, శీతల పానీయాలతో.. డయాబెటిస్, శ్వాస శ్వాసకోస సంబంధిత వ్యాధులు వంటివి వస్తాయంటే నమ్ముతారా? ఎన్నో పరిశోధనల్లో తెలిసిన విషయాలు తెలుసుకుంటే షాక్ అవుతాం. అసలు నిపుణులు ఏం చెప్తున్నారు? వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? అసలు తీసుకోవచ్చా? లేదా అనే వాటి గురించి తెలుసుకుందాం..
((ఇది కూడా చదవండి:: మద్యం తాగుతున్నారా? శరీరంలో ఈ మార్పులు వస్తే ప్రమాదమే!))
ఎక్కువ తినకూడదు
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూల్ డ్రింక్స్, చిప్స్ చాలా ఇష్టంగా తింటుంటారు. దప్పిక తీరుతుందని, రుచిగా ఉంటుందని చల్లగా ఉండే పానీయాన్ని గడ గడ తాగేస్తుంటారు. ఇంటికి అతిథులు వచ్చినా, మనం టూర్లకు వెళ్లినా.. కూల్ డ్రింక్, చిప్స్ కంపల్సరీ. కానీ కూల్ డ్రింక్స్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప.. ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప.. ఎలాంటి ఎనర్జీ కలిగి వుండవు.
మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు వుందని.. అదే పిల్లల్లో చూసినట్లయితే ఏటా 3 – 5 కిలోల బరువు పెరుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పానీయాలలో వుండే యాసిడ్స్ దంతాలకు హాని కలిగించడంతోపాటు.. దంత సమస్యలకు కూడా దారితీస్తుంది.
పరిశోధనలో ఏం తేలింది?
అనేక వ్యాధులకు మూలకారణం ఈ అల్ట్రా ప్రాసెసింగ్ పుడ్ అనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది. అల్ట్రా ప్రాసెసింగ్లో పోషకాలు కూడా పోతాయని.. అంతేకాకుండా ఈ ఫుడ్ ఎంతవరకు పరిమితంగా తినొచ్చనే విషయాన్ని మనం గుర్తించలేమని నిపుణులు చెబుతున్నారు. మనం ఆహారం తినేటప్పుడు కడుపు నిండిపోతే ఆ విషయాన్ని మెదడు మనకు చెబుతుంది. కానీ మీరు ఫుడ్ను ఎంజాయ్ చేసేలా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ను తయారుచేస్తారు. (Health Tips)
వాటిని తినేటప్పుడు మీ కడుపు నిండిపోయిందనేది మనకు కూడ తెలియదని వైద్యులు చెబుతున్నారు. రసాయనాల లాంటి ప్రిజర్వేటివ్లు, కంటికి ఆకర్షణీయంగా కనిపించేందుకు కలరింగ్ ఏజెంట్లు అలర్జీలను కలగచేయడంతో పాటు.. శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయని అంటున్నారు. చాలా మంది లో వీటి ప్రభావాన్ని వెంటనే కనిపెట్టలేకపోయినా.. దీర్ఘకాలంలో అవి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.
వీటిని అప్పుడప్పుడు తినొచ్చుఅది కూడా పరిమితంగా మాత్రమే. మన డైట్లో అవి పదిశాతం కంటే మించితే 2వేల కేలరీలలో 200 కేలరీలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఉందంటే అప్పుడు నష్టం మొదలవుతోందని అని వైద్యులు వెల్లడిస్తున్నారు. వీటిని తినడం వల్ల ముందు బరువు పెరగడం మొదలవుతుందని, ఇది అనేక వ్యాధులు రావడానికి దారితీస్తుందని.. ఈ క్రమంలోనే మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ, దంత సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.
వీటికి బదులుగా ఇవి
(1)ఆరోగ్యాన్ని దెబ్బతీసే కూల్ డ్రింక్స్ కు బదులుగా పుచ్చకాయ, కర్బూజా పండ్లు వంటి పండరసాలు తీసుకోవాలి.
(2) పండరసాలు తాగేటప్పుడు అందులో చక్కెరను వేసుకోకుండా తాగడం ఉత్తమం.
(3) విటమిన్- సీ ఉన్న కూరగాయలు తీసుకోవాలి. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎముకలు బలహీనపడకుండా కాపాడుతుంది.
(4) కూల్ డ్రింక్స్, సోడాలు అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరుగుతారు. కాబట్టి చల్లగా నోటికి రుచికరంగా తాగాలనిపిస్తే.. నిమ్మకాయ నీళ్లు తీసుకోవడం మంచిది. దీని వలన విటమిన్ – సి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
(5) పిజ్జా, బర్గర్లకు బదులుగా పన్నీర్, కోడిగుడ్లు, ఆమ్లెట్, పాలు, ఆకు కూరలను తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటున్నారు వైద్యులు.