Ms Dhoni: ఐపీఎల్ 2024 సీజన్ లో సీఎస్ కే మ్యాచ్ అనగానే ఎక్కడా లేని పాపులారిటీ వస్తోంది. కారణం ఒకే ఒక్కడు ఎంఎస్ ధోని. ధోనికి ఇది ఆఖరి సీజన్ అని రూమర్స్ వస్తుండడం.. లుక్ కూడా వింటేజ్ ధోనిని తలపించడంతో ధోనిని చూడడానికి అభిమానులు పోటెత్తుతున్నారు. బ్యాటింగ్ లైనఫ్ పటిష్టంగా ఉండడంతో ధోని బ్యాటింగ్ కు రాకుండానే తొలి రెండు మ్యాచ్ లు ముగిశాయి.
చేతులు అడ్డుపెట్టుకుని పడిపడి నవ్విన కోహ్లీ, షాక్లో ధావన్.. వీడియో వైరల్!
అయినా కూడా ధోని ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ కు రావడానికి సిద్ధమయ్యాడు. రాజు ఎక్కడున్నా రాజే అన్నది ధోని విషయంలో మరోసారి నిరూపితమైంది. హోంగ్రౌండ్ లో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ ధోని కేవలం వికెట్ కీపర్ గా మాత్రమే బరిలోకి దిగాడు. కానీ ఆదివారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనికి బ్యాటింగ్ చేసే చాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని ధోని రెండు చేతులా ఒడిసిపట్టాడు.
మైండ్ బ్లోయింగ్.. సింగిల్ హ్యాండ్ సిక్స్!
ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ దిగుదామా.. సిక్సర్ల మోత మోగిద్దామా అన్నట్లుగా ధోని సిద్ధమయ్యాడు. మ్యాచ్ గెలిపించలేకపోయినప్పటికి ఫినిషర్ గా మాత్రం ధోని తన పాత్రను సమర్థంగా పోషించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని ధనాదన్ షాట్లతో రెచ్చిపోయాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ధోని బౌండరీ కొట్టిన ప్రతీసారి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. జడేజాతో కలిసి ఢిల్లీ బౌలర్లను అతను భయపెట్టాడు.
ఫోర్ తో పరుగుల ఖాతా తెరిచిన వెంటనే ధోని (Ms Dhoni) ఇచ్చిన క్యాచ్ ను అహ్మద్ పట్టలేకపోయాడు. ఆ తర్వాత ధోని ఆగలేదు. 42 ఏళ్ల వయసులో కూడా ఒంటి చేత్తో భారీ సిక్సర్ కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు . మ్యాచ్ చివరి ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి ఆడియన్స్కు ట్రీట్ ఇచ్చాడు. సిక్సర్ తోనే ఇన్నింగ్స్ ను ముగించడం విశేషం. ధోని జోరు చూస్తే కనీసం ఒక్క ఓవర్ ముందే బ్యాటింగ్ కు వచ్చి ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరుగా ఉండడమే గాక సీఎస్ కే గెలిచేదేమో. ఏది ఏమైనా ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న వేళ తన ధనాదన్ ఇన్నింగ్స్ తో విశాఖ అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశాడు.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 52 పరుగులు), పృథ్వీ షా( 27 బంతుల్లో 43 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పంత్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఆడిన పంత్ లయను అందుకున్న తర్వాత బ్యాట్ ను ఝులిపించాడు. 30 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో మతీశా పతీరానా మూడు వికెట్లు తీయగా..ముస్తాఫిజుర్, రవీంద్ర జడేజా చెరొక వికెట్ తీశారు.
ఆరంభంలోనే ఎదురుదెబ్బ
అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకే ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన రుతురాజ్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరగ్గా.. ఆ వెంటనే రచిన్ రవీంద్ర రెండు పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారీ స్కోరు టార్గెట్ చేజింగ్ చేసే క్రమంలో ఆరంభంలోనే సీఎస్కే ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లైంది. ఈ దశలో అజింక్యా రహానే(30 బంతుల్లో 45 పరుగులు), డారిల్ మిచెల్(26 బంతుల్లో 34 పరుగులు) ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నంలో కాస్త మెళ్లిగా ఆడారు.
దీంతో రన్ రేట్ పెరిగిపోవడంతో స్కోరును పెంచే యత్నంలో ఇద్దరు ఔట్ కావడంతో సీఎస్ కే ఒత్తిడిలో పడిపోయింది. సిక్సర్ల దూబే పెద్దగా ఆకట్టుకోలేదు.. సమీర్ రిజ్వీ కూడా డకౌట్ కావడంతో 102 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జడేజా, ధోనిలు సీఎస్ కే ఇన్నింగ్స్ ను నడిపించారు. ఈ నేపథ్యంలో జడేజా(17 బంతుల్లో 21 పరుగులు) మెల్లిగా ఆడినప్పటికి ధోని(16 బంతుల్లో 37 పరుగులు నాటౌట్) దనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. ఆఖర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో సీఎస్ కే ఓటమి పాలయ్యింది. బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
The Punch.ev Electric Striker of the Match between @DelhiCapitals & @ChennaiIPL goes to MS Dhoni#TATAIPL | @Tataev | #PunchevElectricStriker | #BeyondEveryday | #DCvCSK pic.twitter.com/xcxMA7zOhS
— IndianPremierLeague (@IPL) March 31, 2024