Bank Charges: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తింపు పొందిన ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం వేళ డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతూ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. దీని ఫలితంగా ఇకపై కొత్త ఛార్జీలకు అనుగుణంగా వసూలు చేస్తుంది. ఇంతకీ ఇది ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది? ఎంతవరకు వీటి పెంపు పెంచారు? కొత్త రూల్స్ ఏంటి?తదితర విషయాల గురించి తెలుసుకుందాం..
గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆధార్ అప్డేట్పై కీలక నిర్ణయం!
డెబిట్ కార్డులపై ఛార్జీల బాదుడు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ.75 వరకు పెంచింది. దీనికి జిఎస్టి (GST)అదనంగా ఉంటుంది. పెరిగిన ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డులను సేవలను అందిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డు.. ఇలా పలు రకాల కార్డులపై రూ. 125 వరకు వసూలు చేస్తుంది. ఏప్రిల్ ఒకటి నుంచి వీటి చార్జీలు రూ. 200కు చేరుకుంటాయి. అంతేకాకుండా పెరిగిన ఛార్జీలతో పాటు అదనంగా జిఎస్టి కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆ కార్డులలో కూడా.. (Bank Charges)
యువ, గోల్డ్ కాంబో కార్డుల పై ఇప్పుడు రూ. 175 ఛార్జీ ఉండగా.. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అంటే ఏప్రిల్ ఒకటి నుండి రూ. 250 లకు సవరించారు. అంతేకాకుండా ప్లాటినం, డెబిట్ కార్డ్ ఛార్జీలు రూ. 250 నుంచి రూ. 325 పెంచింది. ప్రస్తుతం ఫ్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డులపై రూ. 350 వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తుండగా.. దీన్ని రూ. 425 లకు సవరించారు. కొత్త ఛార్జీలు అన్నింటికీ జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే పెరిగిన ఛార్జీలతో పాటు జీఎస్టీ అదనంగా కలుపుకుంటే దీని ధర మరింత పెరుగుతుంది.
రివార్డ్ పాయింట్లు రద్దు
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విషయంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను జారీ చేసే సంస్థ ఎస్బీఐ కార్డ్ తన కొన్ని క్రెడిట్ కార్డ్ రివార్డ్ల పాయింట్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుండి కొత్త రూల్స్ ను అమలు చేయబోతునట్లు సమాచారం. దీని ప్రకారం కొంతమంది ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇకపై క్రెడిట్ కార్డు చెల్లింపు పై రివార్డ్ పాయింట్లు ప్రయోజనాన్ని పొందలేరు. గడువు వరకే రివార్డ్ పాయింట్లు చెల్లుబాటు కానుంది.
గడువు తరువాత రివార్డ్ పాయింట్లు నో యూస్
ఇకపోతే ఇప్పటివరకు కూడపెట్టుకున్న రివార్డ్ పాయింట్లకు గడువు తేదీ కూడా అమలు చేశారు. అంటే ఇప్పటివరకు రివార్డ్ పాయింట్లు కూడబెట్టినట్లయితే వాటిని 15 ఏప్రిల్ 2024 లోపు వాడుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అద్దె చెల్లించి అందుకోసం కొన్ని రివార్డు పాయింట్లను పొందినట్లయితే వాటిని ఇప్పుడే వినియోగించండి. లేకపోతే ఏప్రిల్ 15, 2024 తర్వాత రివార్డ్ పాయింట్స్ వున్నా మనం వాడుకోలేము.
వర్చువల్ కార్డ్
గత కొన్ని నెలలుగా ఎస్బీఐ వర్చువల్ డెబిట్ కార్డ్ సేవలు కూడా అందిస్తోంది. ఈ ఎస్బీఐ వర్చువల్ కార్డ్ ని.. ఎలక్ట్రానిక్ కార్డ్ లేదా ఇ-కార్డు అని కూడా పిలుస్తారు.
వర్చువల్ కార్డును పొందడం ఎలా?
(1) వర్చువల్ కార్డును పొందాలి అంటే ముందుగా యోనో యూస్ లోకి వెళ్ళాలి.
(2) తర్వాత మై డెబిట్ కార్డ్ సెక్షన్ లో కొత్త కార్డు అప్లై చేసుకోవాలి. తర్వాత ఓటిపి ఎంటర్ చేసి వర్చువల్ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలి.
(3) అప్పుడు కార్డు జనరేట్ అవుతుంది. ఫిజికల్ కార్డు అక్కర్లేకుండా..చెల్లింపు చేయవచ్చు.
అంతేకాకుండా దీని వల్ల బెనిఫిట్ కూడా ఉంది. ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా ఉండేలా ఇవి సహాయపడతాయి. మొదట్లో దీని మీద ఎటువంటి ఫీజులు లేవు. కానీ ఇప్పుడు వీటికి మ్యాన్యువల్ ఫీజులు ఎస్బీఐ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.