Guntur Kaaram: కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని నటీనటులు అనుకుంటుంటారు. సంక్రాంతి కి ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమాకు భారీ హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. చాలా సంవత్సరాల తర్వాత వీరు జత కట్టడమే ఇందుకు కారణం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇందులో రెండో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరికి అన్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
అయ్యో.. మీనాక్షి ఎలా ఒప్పుకున్నావ్!
ఇండస్ట్రీలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది హీరో హీరోయిన్ లు గురూజీ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలో చిన్న పాత్ర అయిన చేసేందుకే అంగీకరిస్తారు. అయితే తాజాగా విడుదలైన గుంటూరు కారం సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ప్రిన్స్ మహేశ్ వన్ మ్యాన్ షో కారణంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
సంక్రాంతి కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు వద్ద హౌస్ఫుల్ బోర్డు పడుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రెండో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరికి అన్యాయం జరిగిందని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా పూజ హెగ్డే తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ఏం జరిగిందో గానీ అనూహ్యంగా పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకి తప్పుకోవడం.. ఆ స్థానంలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా తీసుకున్నారు.
కేవలం ఆ సీన్ల కోసమే తీసుకున్నారా
ఇక రెండో హీరోయిన్ ప్లేస్ లో మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. అయితే ఈ అమ్మడు అడవి శేష్ హిట్ మూవీ లో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ నీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇక మహేష్ సరసన రెండో హీరోయిన్ అయిన ఆ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో మీనాక్షి కి ఈ సినిమా కెరీర్ పరంగా ఓ మెట్టు పైకి తీసుకెళ్తుందని ఈ అమ్మడుతో పాటు అంతా భావించారు.
తీరా గుంటురు కారం రిలీజ్ అయ్యాక చూస్తే మాత్రం.. మీనాక్షి ఇందులో ఒకటి రెండు సీన్లలో కనిపిస్తుంది. అసలు ఈ సినిమాలో మీనాక్షి కథ, దానికి ఉన్న ప్రాధాన్యం తెలుసుకుందా లేదా మహేష్ సినిమా కాబట్టి చిన్న రోల్ అయినా చాలు అని ఒప్పుకుందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
దీంతో ఈ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు .. ఈ మాత్రం దానికి సెకండ్ హీరోయిన్ అంటూ మీనాక్షిని ఎందుకు తీసుకోవడమంటూ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. హీరోయిన్గా ఎదుగుతున్న ఈ అమ్మడు గుంటూరు కారం చిత్రంలో అన్యాయం జరిగిందంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సుందరి దళపతి విజయ్ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు చిత్రాలు ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుండడంతో మీనాక్షి ఆసలు దీనిపైనే పెట్టుకుందనే చెప్పాలి.