HCL Tech:సాఫ్ట్వేర్ జాబ్.. లక్షల్లో జీతం, రంగుల ప్రపంచం, విదేశాల్లో స్థిరపడే అవకాశం.. ఇదంతా ఒకప్పటి మాట. అయితే మొదట కరోనా, ఆ తరువాత ఆర్థిక మాంద్యం దెబ్బకు ఇవన్ని మారిపోతున్నాయి. ప్రస్తుతం దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. అలానే నియమాలను కూడా కఠినతరం చేస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో దిగ్గజ ఐటీ సంస్థలు వీటినే ఫాలో అవుతున్నాయి. తాజాగా సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్ తమ ఉద్యోగులు వారానికి మూడుసార్లు కార్యాలయానికి రిపోర్టు చేయాలని కోరింది, లేని పక్షంలో ఫిబ్రవరి 19 నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు బాంబు పేల్చింది. ప్రస్తుతం హెచ్సీఎల్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి.
(( దీనిపై ఓ లుక్కేయండి: సామాన్యులకు శుభవార్త.. అదిరిపోయేలా కొత్త స్కీం.. 300 యూనిట్ల ఉచిత కరెంట్! ))
ఇక నుంచి ఆఫీస్ తప్పనిసరి
లాక్డౌన్ తగ్గుముఖం పట్టినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోం, హైబ్రీడ్ మోడల్ ,మునుపటిలా ఆఫీసులకు రావాలి.. ఐటీ సంస్థలు, ఉద్యోగులు మధ్య నలుగుతున్న పదాలు ఇవే. ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ప్రభావంతో అంతర్జాతీయంగా ఉద్యోగులు పరిస్ధితి దయనీయంగా మారిందనే చెప్పాలి. దీనికితో దేశంలోని పలు ఐటీ కంపెనీలు మెల్లగా తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్లోకి మార్చుకుంటున్నాయి. ఇదివరకే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ ఉద్యోగులను వారానికి ఐదు రోజులు, నెలకు 10 రోజులు, వారానికి మూడు రోజులు ఆఫీస్కు వచ్చి పని చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశంలోని మూడవ అతిపెద్ద ఐటి కంపెనీ హెచ్సీఎల్ కూడా ఇదే దారిలో పయనిస్తోంది.
DFS (డిజిటల్ ఫౌండేషన్ సేవలు) ఉద్యోగులు, వారి బ్యాండ్ (E0, అంతకంటే ఎక్కువ)తో సంబంధం లేకుండా వారానికి కనీసం మూడు రోజులు వారికి కేటాయించిన HCLTech కార్యాలయాల నుండి పని చేయాల్సి ఉంటుందని,” HCLTech సీనియర్ అధికారి తెలిపారు. కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తుందని, ఇందులో ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుందని లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
వారికి జీతం లేకుండా సెలవు ఇస్తాం
అంతేకాకుండా దీనిపై హెచ్ఆర్ సమావేశాల అనంతరం ఇలా చెప్పారు. ఏ ఉద్యోగి అయినా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రిపోర్ట్ చేయకపోతే .. వారికి జీతం లేకుండా సెలవు ఇస్తామని మేనేజ్మెంట్ హెచ్చరిస్తోంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి చెప్పారు. కంపెనీ సిబ్బంది ఉత్పాదకతను నిశితంగా పరిశీలించడంతో పాటు కనీసం ఎనిమిది గంటల ల్యాప్టాప్ యాక్టివిటీని వారు నిర్వహించాలని కోరింది.
అందుకే ఈ తరహా నిర్ణయాలు సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో HCLTech నికర లాభంలో సంవత్సరానికి 6.23 శాతం (YoY) వృద్ధితో రూ. 4,351 కోట్లకు నమోదు చేసింది. ఇది టాప్-ఐదు భారతీయ ఐటీ కంపెనీలలో అత్యుత్తమ పనితీరు. ఉద్యోగుల సంఖ్యపై, క్యూ3లో HCLTech నికర హెడ్కౌంట్ 3,617 పెరిగింది.