Youtube: యూట్యూబ్ ఈ పేరు వీడియో విభాగంలో మారుమోగుతోంది. 2005, ఫిబ్రవరి 14 న ప్రారంభమైన యూట్యూబ్ కొంచెం కొంచెం ఎదుగుతూ నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో ఈ వీడియో ఫ్లాట్ఫామ్ దిగ్గజం ఓ రేంజ్లో దూసుకుపోయింది. అంత వరకు కేవలం యూట్యూబర్లు, సోషల్మీడియా వాడుతున్న నెటిజన్లు మాత్రమే యూట్యూబ్ గురించి తెలిసినా.. లాక్డౌన్ దెబ్బకు సామన్య ప్రేక్షకుడికి కూడా చేరువైంది.
ఓ పక్క వినోదం అందిస్తూనే మరో వైపు కంటెంట్ క్రియేటర్లకు ఆదాయాన్ని అందిస్తోంది. దీంతో ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎన్ని కొత్త ఛానెల్స్ వస్తున్న టాప్లో కొన్ని మాత్రమే దూసుకుపోతున్నాయి.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తొలి టాప్టెన్ యూట్యూబ్ ఛానల్స్ వివరాల్ని విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా . ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే… ఇతర దేశాల యూట్యూబ్ ఛానల్స్తో పోలిస్తే భారత్కు చెందిన యూట్యూబ్ ఛానల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది యూజర్లను ఆకట్టుకుంటూ సబ్స్క్రైబర్ లాయల్టీ పరంగా టాప్లో దూసుకుపోతోంది.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ (YouTube) ఛానెల్స్పై ఓ లుక్కేస్తే..
T-సిరీస్(T-series): ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్గా టీ సిరీస్ కొనసాగుతోంది. 257 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో దూసుకుపోతోంది. ఈ ఛానెల్లో మ్యూజిక్ వీడియోలు, చలనచిత్రాలు ట్రైలర్లతో సహా విభిన్న కంటెంట్లతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మిస్టర్ బీస్ట్: జిమ్మీ డొనాల్డ్సన్, ఈ పేరు కంటే మిస్టర్బీస్ట్ అంటే నెటిజన్లు ఈజీగా గుర్తుపడతారు. అతను ఒక అమెరికన్ యూట్యూబర్. తను కాస్టీ విన్యాసాలు, విభిన్న సవాళ్లు, సరికొత్త కంటెంట్లతో తన సబ్స్క్రైబర్లకు వినోదాన్ని పంచుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ యూట్యూబర్ 232 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో, రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
కోకోమెలన్: పిల్లలు ఆధారిత ఛానెల్గా రంగంలోకి దిగింది కోకోమెలన్. ఇందులో 3డీ యానిమేటెడ్ నర్సరీ రైమ్లు, పిల్లలను ఆకట్టుకునేలా పాటల వీడియో కంటెంట్తో కిడ్స్ను ఆకట్టుకుంటుంది. మొత్తం 170 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఈ ఛానెల్ను ఆదరిస్తున్నారు.
సెట్ ఇండియా (సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్): భారత్లో ప్రముఖ సంస్థ అయిన సెట్ ఇండియాకు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో హిందీ కంటెంట్ ద్వారా నెటిజన్లను ఆకర్షిస్తోంది. 167 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లతో ఇండియా నుంచి టాప్ టెన్లో రెండో ఛానెల్గా నిలిచింది. (ఇదీ చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. మళ్లీ అదే దారి, మరో షాకిచ్చిన అమెజాన్! )
కిడ్స్ డయానా షో: ఆన్లైన్లో కిడ్స్ డయానా షో తో చాలా పాపులర్ అయ్యింది డయానా కిడిస్యుక్. ఈ యూట్యూబర్ తన కుటుంబ సభ్యులు కలిసి ఈ ఛానెల్ను నిర్వహిస్తోంది. ఇందులో 118 మిలియన్ల మంది సబ్స్కైబర్ల ఈ
ప్యూడైపీ: స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కెజెల్బర్గ్ రూపొందించిన, PewDiePie ప్లాట్ఫారమ్ పాపులర్ ఛానెల్లలో ఒకటిగా నిలిచింది. ఇందులో 111 మిలియన్ల మంది సబ్స్కైబర్లు ఉన్నారు.
లైక్ నాస్త్య: ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది నాస్త్య అనే యువతి నిర్వహిస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలకు వినోదాన్ని అందించడమే టార్గెట్గా పెట్టుకుని ఆ తరహా కంటెంట్ను అందిస్తోంది. ఇక సబ్స్క్రైబర్లు విషయానొకొస్తే 112 మిలియన్ల మంది ఉన్నారు.
వ్లాడ్ అండ్ నికి: ఈ ఛానెల్ను ఇద్దరు అన్నదమ్ములు నిర్వహిస్తూ. . సరికొత్త కంటెంట్తో రాణిస్తున్నారు. 108 మిలియన్ల మంది సబ్స్కైబర్లు ఈ ఛానెల్ సొంతం.
జీ-మ్యూజిక్ కంపెనీ: ప్రధానంగా హిందీ ఎంటర్టైన్మెంట్తో పాటు విస్తృతమైన ఆఫర్లతో, జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. ఇందులో 104 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్: WWE యూట్యూబ్ ఛానెల్ అనేది ప్రొఫెషనల్ రెజ్లింగ్ ఇష్టపడే వాళ్ల గమ్యస్థానమనే చెప్పాలి. 99 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 73,000 మంది వీడియోలతో, ఈ ఛానెల్ యూట్యూబ్లో రాణిస్తోంది. ఇందులో రెజ్లింగ్ స్టార్ల విన్యాసాలను, ఫైట్స్లను నెటిజన్లకు అందిస్తోంది.