Irctc: భారతీయ రైల్వే శాఖ ప్రతి రోజూ లక్షలాది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తూ ఎనలేని సేవలు అందిస్తోంది. ఇటీవల రైల్వే శాఖకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చేస్తోంది. అందులో ఐఆర్సీటీసీలో ఇకపై వ్యక్తిగత అకౌంట్ ద్వారా టికెట్ బుకింగ్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
దీని ప్రకారం ఐఆర్సీటీ నుంచి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే కేవలం ఆ వ్యక్తి వారి కుటుంబ సభ్యులు కాకుండా వారి బంధువులు, స్నేహితులకు బుక్ చేసిన వారిపై కఠిన శిక్షలు విధించే అవకాశం, భారీ జరిమానా కూడా విధించనున్నట్లు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై ఇండియన్ రైల్వేస్ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ ప్రచారంపై స్పష్టతనిచ్చింది. Irctc
రైల్వే కొత్త రూల్స్.. ఇలా టికెట్ బుక్ చేస్తే జరిమానా, జైలుకే!
క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
ఆన్లైన్ టికెట్ బుకింగ్ కి సంబంధించి ఇటీవలి కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అవాస్తవమని రైల్వే శాఖ బదులిచ్చింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టతనిచ్చింది. Irctc లో ఖాతా కలిగిన యూజర్లు వారి ఐడీతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ..ఇలా ఎవరికైనా ఈ-టికెట్లు ( online tickets) బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనితో పాటు
ఒక ఐడీతో నెలకు 12 టికెట్లు.. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న యూజర్ ఐడీ నుంచి నెలలో 24 టికెట్లు వరకూ బుక్ చేసుకొనే సదుపాయం ఉంధని తెలిపింది. అయితే వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ-టికెట్లు ఏ రకమైన వాణిజ్యపరమైన విక్రయం కోసం ఉద్దేశించినవి కాదనీ అలాంటివి ఎవరైనా పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రిత్వశాఖ‘ఎక్స్’ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
దీని బట్టి ఆన్లైన్ ఈ టికెట్ బుక్ చేయడంపై రైల్వేశాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇంటి పేరుతో సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువుల పేరిట మీకు ఉన్న పరిమితి మేరకు ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. వాణిజ్య పరంగా రైలు టికెట్లను బుక్ చేయాలనుకుంటే కేవలం రైలే శాఖ నుంచి అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్పార్టీ బుకింగ్ ద్వారా ఈ వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే..వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఇండియన్ రైల్వేస్ హెచ్చరిస్తోంది.