Kaliyuga Pattanam Lo Movie: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి కథ, మాటలు ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కలియుగం పట్టణంలో అంటే ఊరిపేరా? టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
ఊరిపేరు కాదు. మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఏంటి అనే ఈ మూవీ స్టోరీ ఇది. ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి ఇందులో చూపిస్తాము.
టైటిల్లో మస్కిటో కాయిల్స్, రెంచ్ ఉన్నాయి. కలియుగాన్ని ఏమన్నా రిపేర్ చేయబోతున్నారా?
లేదండి. వాటికి సినిమాలో కథకి లింక్ ఉంటుంది. వాటితో స్టోరీ నడుస్తుంది. అందుకే పెట్టాము.
నంద్యాల బ్యాక్ డ్రాప్ లో తీసుకోడానికి రీజన్ ఏంటి?
నంద్యాల దగ్గర్లోనే నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. కథలో ఫారెస్ట్ కి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది. అందుకే నంద్యాలలో చేసాము.
((దీనిపై ఓ లుక్కేయండి: విడాకుల తర్వాత మొదటిసారి స్టేజి మీద చై-సామ్! ))
హీరోని మెంటల్ హాస్పిటల్లో చూపించారు. మరి ట్రైలర్లో అసలు క్యారెక్టర్ ఏంటి?
హీరో మెంటల్ హాస్పిటల్ లో ఉన్న దగ్గర్నుంచే కథ మొదలవుతుంది. దాన్ని తెరపై చూస్తే బాగుంటుంది.
ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసుకొని చేశారా?
బయట ఇలాంటివి చాలా చూస్తున్నాము. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ ప్రగ్నెంట్ లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది. నేను ప్రగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదు అని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతుంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నాను.
ఇది మీ మొదటిగా దర్శకత్వం వహించిన సినిమా, అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు?
నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమా తీశారు. అప్పుడు షూటింగ్ లో నేను అసిస్టెంట్ గా పనిచేసాను. అక్కడ్నుంచి సినిమా ఇంట్రెస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్ లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని సినిమాలకు పనిచేసాను. కరోనా సమయంలో నిర్ణయించుకుని..ఆ తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయాని వచ్చాను. కోడి రామకృష్ణ దగ్గర నుంచి నా సినీ ప్రయాణం మొదలుపెట్టి పలువురు డైరెక్టర్ వద్ద పనిచేసాను. అంతేకాకుండా పలు చిత్రాలకు ఘోస్ట్ రైటర్గా కూడా పనిచేసాను.
హీరోగా విశ్వ కార్తికేయని తీసుకోవడాని కారణం?
ముందుగా నేను ఒకటి రెండు చిత్రాల్లో నటించిన హీరోల దగ్గరకు వెళ్లి అడిగాను. అయితే కథ విన్నాక ఇందులోని ఇంటెన్స్ క్యారెక్టర్ ని వాళ్ళు చెయ్యలేమన్నారు. అ సమయంలోనే నాకు విశ్వ ప్రొఫైల్ వచ్చింది. స్టోరీ విన్నాక ధైర్యంగా చేస్తా అని చెప్పాడు. నాకు కూడా అతనిలో ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది. గత సినిమాల్లో చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు. ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా విశ్వ కెరీర్ పరంగా గుర్తింపుని ఇస్తుంది. ఈ చిత్రం రిలీజ్ అనంతరం .. అతడిని కలియుగం కార్తికేయ అని పిలుస్తారు.
తర్వాత చిత్రాలు ఏమైనా మొదలుపెడుతున్నారా?
ఈ మూవీకే సీక్వెల్గా కలియుగ నగరంలో చిత్రీకరిస్తున్నాం