Kiran Abbavaram: కరోనా మహమ్మారి తరువాత ప్రజల ఆలోచన విధానం మారిందనే చెప్పాలి. ప్రత్యేకించి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టేస్టీ, హైజీన్ ఫుడ్ ఎంపిక విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడడం లేదు.ఈ నేపథ్యంలో భోజన ప్రియులను దష్టిలో పెట్టుకుని ఎంతో రుచికరమైన, శుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది మన బాబాయ్ హోటల్. గత కొన్ని రోజులుగా బాబాయ్ హోటల్ సెలెబ్రిటీల తాకిడితో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాదాపూర్లో బాబాయ్ హోటల్ ప్రారంభ కార్యక్రమానికి హాజరై సందడి చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో పాటు హోటల్ యజమానులు కేవీ దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలసి హైదరాబాద్లోని మాదాపూర్ మెట్రో పిల్లర్ C1766 సమీపాన బాబాయ్ హోటల్ కొత్త బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు తాము తినే ఆహారం పట్ల సహజంగానే ఇష్టం, అభిరుచి ఉంటుంది. ప్రత్యేకించి వాళ్లు టేస్ట్తో పాటు మంచి ఆహారాన్ని తినేందుకు మొగ్గు చూపుతుంటారు. అందుకే కాస్త రుచికరంగా ఫుడ్ దొరికితే చాలు.. భోజన ప్రియులు ఎంత దూరమైన వెళ్లి ఓ పట్టు పట్టేసి వస్తుంటారు.
మరోసారి వాయిదా పడ్డ కల్కి.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
అలా తినేసి వారి మనసు సంతృప్తి పరుస్తారు. హోటల్ ప్రారంభం అనంతరం కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘బాబాయ్ ఇడ్లి, దోశ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫుడ్ని తినగానే నా కడుపుతో పాటు మనసు కూడా నిండినట్టుగా అనిపిస్తుందని అన్నారు. ‘గత 8 దశాబ్దాలుగా బాబాయ్ హోటల్ ప్రజలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది అందరి మన్ననలు పొందుతోంది. దోశ, ఇడ్లీ, వడ, ఇలా టిఫెన్స్ అందిస్తూ.. ప్రజలకు ఫేవరేట్ ప్లేస్గా మారింది. ఈ వంటలలో ప్రతి ఒక్కదానికి దేని రుచి దానికే ప్రత్యేకంగా ఉంటుంది. దక్షిణ భారత వంటకాలు, రుచులను కొత్తగా అందించమే లక్ష్యం’ అని హోటల్ యజమానులు కేవీ దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి తెలిపారు.