Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన “శ్రీమంతుడు” సినిమా సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాను రాసిన నవలను కాపీ కొట్టి ఆ చిత్రాన్ని తీశారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు వేయడం.. అది ఆయనకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయితే ఈ వివాదం తేలకముందే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మహేష్ బాబు తీసిన మరో మూవీ కథ కూడా తన దేనంటూ శరత్ చంద్ర చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇంతకీ ఏంటా మూవీ? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
మరో బాంబు పేలింది..
శ్రీమంతుడు.. ప్రిన్స్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీస్ లిస్ట్లో టాప్లో ఉంటుందనే చెప్పాలి. అయితే ఇటీవల ఈ చిత్రం అనూహ్యంగా కాపీరైట్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర హైదరాబాదులో నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం శ్రీమంతుడు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
అయితే నాంపల్లి కోట ఆదేశాలను సవాల్ చేస్తూ చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లినా.. ఈ తీర్పులో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని తీర్పు వచ్చింది. ఇదిలా ఉండగా ఓవైపు శ్రీమంతుడు కేసు కొనసాగుతుండగానే రచయిత శరత చంద్ర మరో బాంబు పేల్చాడు. వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా కథ కూడా తనదేనంటూ శరత్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతే కాకుండా ఈ మూవీ విషయంలో కూడా తన హక్కును పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆలస్యంగా క్లెయిమ్ చేసుకోవడం..
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన మహర్షి మూవీ మహేష్ బాబు కెరీర్ లోనే మైలురాయి అని చెప్పచ్చు. నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా సాధించిన ఈ చిత్రం కాపీ అంటూ శరత్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా ఈ ఆరోపణపై వంశీ పైడిపల్లి ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే మహర్షి మూవీ కథ విషయంలో ఇలా ఆలస్యంగా క్లెయిమ్ చేసుకోవడంపై సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైమైనా ఈ విషయంపై వాస్తవాలు త్వరలోనే బయపడనున్నాయి.