Manmadhudu Heroine Anshu Ambani: అందం, అభినయంతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన కొందరు హీరోయిన్లు పలు కారణాల వల్ల హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటారు. మరికొందరు మాత్రం ఏళ్ల తడబరీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటారు.
ఈ తరహాలోనే నాగార్జున సినిమాలో హీరోయిన్గా నటించిన ఓ భామ దాదాపు 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ముద్దుగుమ్మ ఏం మాట్లాడిందంటే..
((దీనిపై ఓ లుక్కేయండి: సామ్ విడాకులకు కారణం ఈ అమ్మాయేనా?.. నెట్టింట రచ్చ చేస్తున్న పోస్ట్!))
తొలి సినిమాతోనే క్రేజ్
అన్షు అంబానీ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ నాగర్జున నటించిన మన్మధుడు హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో బేల చూపులతో అమాయకంగా మాట్లాడే ఆమె పాత్ర ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా చేయగా.. మిస్సమ్మలో అతిధి పాత్రలో తలుక్కున మెరిసింది.
2004లో జై అనే తమిళ చిత్రంలో శివ చివరిసారిగా నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. ఇక అన్షు పుట్టి పెరిగింది అంతా ఇంగ్లండ్ లోనే కావడంతో అక్కడే చదువు పూర్తి చేసింది. తరువాత బిజినెస్ మ్యాన్ సచిన్ సాగర్ను పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అమ్మడు మీడియా ముందుకు వచ్చింది.
అందుకే సినిమాలకు దూరం
ఇటీవల ఏదో పనిమీద భారత్కు వచ్చిన అన్షు ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో పలు విషయాలను షేర్ చేసుకుంది ముఖ్యంగా తన సినిమాలు మానేయడానికి గల కారణాలు వెల్లడించింది. అన్షు మాట్లాడుతూ ఇక తనకు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు ఇండియాకు రాగా.. మన్మధుడు సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలిపింది. ఓ పక్క సినిమాల్లో యాక్టింగ్ చేస్తూనే మరోవైపు చదువుపై దృష్టి పెట్టాలనుకుందంట ఈ భామ. ఈ నేపథ్యంలోనే మన్మధుడు, రాఘవేంద్ర సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అన్షు తెలుగులో చేసిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గానే నటించింది. ఇది చాలదన్నట్లు ఆ రెండు సినిమాల్లోనూ తన పాత్ర చనిపోతుంది. తనకి ఈ చిత్రాల తర్వాత వచ్చిన పాత్రలు కూడా ఇదే తరహా ఉండడంతో పదే పదే అలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదని చెప్పింది. ఒకే రకమైన పాత్ర చేయడం కంటే సినిమాలు మానేయడం బెటర్ అని అనిపించి సినిమాలకు పుల్స్టాప్ పెట్టడం బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది అన్షు.