రిలయన్స్ సంస్థ.. భారత్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయిల్, టెలికాం రంగం, రిటైల్ ఇలా ఎన్నో వ్యాపకాలతో మెట్రో సిటీల నుంచి గ్రామాల వరకు తన వ్యాపారాలను విస్తరించుకుంటూ పోయింది రిలయన్స్. తమ వస్తువులు, సేవలకు సంబంధించిన క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడదన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కంపెనీ బ్రాండ్ పేరుని ఉపయోగించుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వందల కోట్లు చెల్లించారు.
బ్రాండ్ ముఖ్యం… పేరు కోసం రూ.254 కోట్లు!
గత ఏడాది చివరిలో ఆర్ఐఎల్ ( రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) తన ‘రిలయన్స్ రీటైల్ వెంచర్స్’ ద్వారా ప్రముఖ జర్మనీ చెందిన రీటైల్ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మెట్రో ఏజీ ను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఈ ఒప్పందంలో మెట్రోకు చెందిన , 6 స్టోర్లు, 31 హోల్సేల్ స్టోర్లలో ఉన్న స్థలాల్ని కూడా రిలయన్స్ చేజిక్కించుకుంది. భారత్లో ఈ వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలుగా మెట్రో లైసెన్స్లు కూడా పొందింది. వీటితో మెట్రో బ్రాండ్ పేరును కూడా రిలయన్స్ ఉపయోగించుకోవాలనుకుంది. అందులో భాగంగా మెట్రో ఇండియా ఆస్తులతో పాటు ఆ బ్రాండ్పేరును వినియోగించుకునేందుకు రిలయన్స్ రూ.254 కోట్లు చెల్లించింది. ఈ విషయాన్ని మెట్రో తన వార్షిక ఫలితాల విడుదల నివేదికలో తెలిపింది. పెరిగిన మార్కెట్ కన్సాలిడేషన్, వేగవంతమైన డిజిటలైజేషన్ , వ్యాపారంలో తీవ్రమైన పోటీ కారణంగా ప్రధాన వృద్ధి వ్యూహానికి అనుగుణంగా లేదని, ఈ కారణాలతో రిలయన్స్ రిటైల్ వెంచర్స్కు విక్రయించాల్సి వచ్చిందని మెట్రో పేర్కొంది.
తొలిసారి 2003 లో…..
2003లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించిన మెట్రో క్యాష్ & క్యారీ, 13 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్సేల్ అవుట్లెట్లను ఏర్పాటు చేసింది. అనతి కాలంలోనే ఈ జర్మన్ రిటైల్ సంస్థ భారత దేశంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. చిన్న, పెద్ద కిరానా దుకాణాలు, కార్యాలయాలు, కంపెనీలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు క్యాటరర్లు వంటి కస్టమర్లను వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ‘క్యాష్-అండ్-క్యారీ’ వ్యాపార నమూనాతో దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టిన కంపెనీ కూడా ఇదే. తొలి కంపెనీ ఇదే. ఇందులో రిటైల్ వ్యాపారానికి కావాల్సిన కిరాణా ఆహార ఉత్పత్తులలో సాధ్యమైనంత తక్కువ ధరకే తమ కస్టమర్లకు అందిస్తుంది. దీంతో ఈ సంస్థ అనతి కాలంలో కస్టమర్ల సంఖ్యను పెంచుకోగలిగింది.