Mumbai Indians: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఓటమిని మూటకట్టుకుంది. దీంతో ఐపీఎల్ -2024 సీజన్ను ముంబై ఓటమితో మొదలుపెట్టింది. గెలుపు నామమాత్రం అనిపించని మ్యాచ్లో .. చేజేతులా విక్టరీని గుజరాత్కు అందించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేలవ కెప్టెన్సీ ప్రధానంగా కొంపముంచిందని నెట్టింట కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అసలేం జరిగిందంటే..
అంతా బాగుంది.. కానీ ఆ ఓవరాక్షన్ అవసరమా బ్రో! వైరల్గా మారిన వీడియో
ఈజీ టార్గెట్ అనుకున్నారు..
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ని భారీ స్కోరుకు వెళ్లకుండా ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 168 కట్టడి చేసింది. రోహిత్, కిషన్, బ్రేవిస్, డేవిడ్, హార్దిక్ లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న MI జట్టుకు ఈ స్కోరుని అందుకోవడం అంత పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. అయితే గుజరాత్ మాత్రం పక్కా ప్లాన్తో బౌలింగ్ చేసి ఆరంభంలో ఇషాన్ కిషన్ని పెవిలియన్కు పంపించింది. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్ దహీర్ 10 బంతుల్లో 20 పరుగులతో కాసేపు బౌండరీలతో ప్రత్యర్థులను భయపెట్టిన మూడో ఓవర్లోనే వికెట్ సమర్పించుకున్నాడు.
వారిద్దరూ నిలబడ్డారు!
నమన్ వికెట్ పడగానే బ్రేవిస్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే రోహిత్ వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్రేట్ పెరుగకుండా చూస్తున్నాడు. వీరిద్దరూ మొదటగా కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సింగిల్స్ తీసుకుంటూ అవకాశం దొరికినప్పుడు బంతులను బౌండరీలకు తరలిస్తూ మ్యాచ్పై పట్టు సాధించారు. ఒకానొక దశలో మ్యాచ్ ముంబై ఇండియన్స్దే (Mumbai Indians) అని అనుకున్నారంతా. అయితే రోహిత్ ఎల్బీగా అవుట్ కావడంతో గుజరాత్ టీంకు మంచి బ్రేక్ దొరికినట్లైంది. ఇక్కడి నుంచి గిల్ సేన మ్యాచ్పై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది.
పాండ్యా చేసిన తప్పు అదే
16 ఓవర్లో బ్రేవిస్ ఔట్కాగానే అప్పటికే రన్రేట్ ఇంచుమించుగా ఓవర్కి 10 ఉంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు హార్థిక్ రాకుండా మరో ప్లేయర్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. తర్వాత వరుస ఓవర్లలో 3, 9, 8లతో 18 బంతులకు 20 పరుగుల మాత్రమే వచ్చాయి. ఇక్కడే ముంబై మ్యాచ్ గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. పాండ్యాకు గతంలో ఒత్తిడి సమయంలో ఆడిన అనుభవం ఉంది. ఒక వేళ ఆ సమయంలో డేవిడ్ కాకుండా పాండ్యా బరిలోకి దిగుంటే బాగుండేదని.. మ్యాచ్ చివరి ఓవర్లో అంత ఒత్తిడి ఉండేది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హార్థిక్ తీసుకున్న నిర్ణయమే మ్యాచ్ని ముంబై నుంచి గుజరాత్ వైపు మళ్లిందని అభిప్రాయపడుతున్నారు. కాగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసి గెలిసి .. ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఓటమిని చవిచూసింది.