Pm Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల కోసం మరో పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ స్కీంపై అంతటా చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ కొత్తగా పీఎం సూర్య ఘర్ బిజిలీ ముఫ్త్ యోజన కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రజలకు ఉచిత విద్యుత్ అందించేందకు ఉపయోగపడుతుంది. దేశంలోని కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సౌర ఫలాకాలను ఈ స్కీం కింద ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ పథకం పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం..
ఈ పథకం వెలుగునిస్తుంది
ఇటీవలే ప్రారంభించిన “ప్రధానమంత్రి సూర్యోదయ యోజన”కు సంబంధించి ప్రధాని మోదీ (Narendra Modi) తన ట్విట్టర్ ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. అందులో.. ఈరోజు అయోధ్యలో జీవిత పవిత్రమైన సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పు పై వారి సొంత సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలన్న నా సంకల్పం మరింత బలపడింది.
((దీనిపై ఓ లుక్కేయండి: ఆధార్ కార్డ్దారులకు డెడ్లైన్.. మార్చిలోపు మార్చకపోతే మనీ కట్టాల్సిందే!))
అయోధ్య నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే. మా ప్రభుత్వంలో ఒక కోటి ఇళ్ళకు పైన రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసే లక్ష్యంతో నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ ప్రధాని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజలు విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని ఆయన తన ట్వీట్లో చెప్పుకొచ్చారు.
స్కీం లక్ష్యం అదే
ఈ పథకం ద్వారా ప్రజలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందించడం ద్వారా కోటి ఇళ్లలో వెలుగుని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. తాజాగా అమలు చేయనున్న పథకం ద్వారా గతంలో ఇస్తున్న సబ్సీడిని పెంచునుంది. ఈ స్కీం ద్వారా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ను పొందవచ్చు. అయితే నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఈ పథకం ద్వారా మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సబ్సిడీ వివరాలు
ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు సబ్సిడీ నుంచి బ్యాంకుల రుణాలు పొందవచ్చని.. వీటితో ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం పడకుండా కేంద్రం భరోసా ఇస్తుందన్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మోడీ అధికారులు అధికారులకు సూచించారు.
తగ్గనున్న బిల్లులు
ఇంటిపై సౌర శక్తి పలకలు ఏర్పాటు చేసి వాటిని మెయిన్ పవర్ సప్లై కి కరెక్ట్ చేస్తారు. దీంతో గ్రీడ్ తో కనెక్ట్ అయిన ఎలక్ట్రిసిటీ పై ఆధారపడడం తగ్గుతుంది. ఫలితంగా ప్రజలకు కరెంటు బిల్లు భారం ఉండదు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గుతుంది. ఇక ఈ పథకం కోసం pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని ప్రధానమంత్రి మోడీ సూచించారు.
వారే అర్హులు
* దరఖాస్తుదారులు కచ్చితంగా దేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారుని వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలకు మించకూడదు.
* ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
* ఈ స్కీమ్ కోసం అవసరమైన పత్రాలన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి లేదా దరఖాస్తు ఫారంలో ఫారంతో పాటు సమర్పించాలి.