ఫోన్డ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించిందంటూ సోషల్ మీడియాలో ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెట్టిన పోస్ట్ కలకాలం సృష్టించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా పూనమ్ పాండే చనిపోవడం ఏంటా? అని అంతా షాక్ కి గురయ్యారు. ఆమె మరణం పై ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరోవైపు ఆమె మరణం గురించి సోషల్ మీడియాలో వరుస పెట్టి కథనాలు వచ్చాయి. మొత్తానికి ఈమెపై వచ్చిన వార్తలు అన్నీ హైలెట్ అయ్యాయి. అయితే అదంతా ఒట్టిదే అని.. కేవలం ఒక కారణం కోసమే ఇదంతా చేసినట్లు స్వయంగా పూనమ్ పాండే ఓ వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చింది.
*అవగాహ కోసమే చేశాను..*
వివాదాస్పద నటి పూనమ్ పాండే… ఈ పేరు సరిగ్గా సరిపోయే పనులు చేస్తుంటుంది ఈ భామ. గతంలో కాంట్రవర్సీ స్టేట్మెంట్ లతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. తాజాగా పూనమ్ మృతి చెందినట్లు వార్తలు సోషల్ మీడియా లో వైరల్ చేయించి…సడెన్ గా అదంతా అబద్ధం అంటూ అందరికీ షాక్ ఇస్తూ.. ఓ వీడియోని విడుదల చేసింది పూనమ్.
ఆ వీడియోలో…హే ఆల్.. నేను పూనమ్ పాండేను బ్రతికే ఉన్నాను. సర్వైకల్ కాన్సర్ తో నేను చనిపోలేదు.. కానీ వేలాది మంది మహిళలు చనిపోతున్నారు. దీన్ని నివారించడం సాధ్యమే అయినప్పటికీ.. సరైన అవగాహన లేదు. హెచ్ విపీవీ వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే వేలాది మంది మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు అంటూ తన చేష్టల వెనక ఉన్న కారణాన్ని తెలిపింది. దీనితో పాటు తన వలన బాధపడిన వారికి క్షమాపణ చెబుతూ.. కేవలం దీనిపై అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరింది.
ఇంతకు తెగించావా..?
పూనమ్ పాండే చేసిన పబ్లిసిటీ స్టంట్ అని తెలియగానే సోషల్ మీడియాలో ఆమె పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిసిటీ కోసం ఇంతకు తెగించావా అంటూ మండిపడుతున్నారు. కేవలం అవగాహన కల్పించడం కోసం ఎన్నో దారులు ఉన్నాయని… చనిపోయినట్లు వార్తలు పుట్టించి కలకలం సృష్టించాలా అంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పూనమ్ దీని వెనుక కారణాన్ని చెప్పినప్పటికీ… నకిలీ వార్తను వ్యాప్తి చేసినందుకు పలువులు మండిపడుతున్నారు. మరికొందరు ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.