Rashmika Mandanna: రష్మిక మందన్నా.. పుష్పతో నేషనల్ క్రష్గా మారిన ఈ అమ్మడు, ఆ క్రేజ్ని కొనసాగిస్తూ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ బ్యూటీ బోలెడన్ని ఆఫర్స్ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల రష్మిక నటించిన యానిమల్ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు కూడా లభించింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పై ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై నేషనల్ క్రష్ స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చింది.
టాలీవుడ్లో ‘ఛలో’ సినిమాతో పరిచయమైన రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపుతో పాటు నేషనల్ క్రష్గా క్రేజ్ను సంపాదించుకుంది. నటన, అందంతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఈ భామ . ఇటీవల సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీలో నటించింది.
((దీనిపై ఓ లుక్కేయండి: అరాచకం అంటే ఇదేనేమో.. కల్కిలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్?))
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రష్మిక మరోసారి భారీగా పారితోషకం పెంచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతకు ముందు సినిమాకి మూడు కోట్లు తీసుకునే రష్మిక.. ఇకపై ఏకంగా నాలుగు కోట్లు అడుగుతుందంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి ఈ అమ్మడు వరకు చేరింది. దీంతో ఈ బ్యూటీ ఓ పోస్ట్ చేస్తూ తన సమాధానాన్ని క్యూట్గా చెప్పింది.
క్యూటీ.. కౌంటర్ మామూలుగా లేదుగా..
‘యానిమల్’ మూవీ తర్వాత తను పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందంటూ వచ్చిన వార్తల పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రష్మిక ఓ పోస్ట్ చేసింది. “నా రెమ్యూనరేషన్ విషయం గురించి మీకు ఎవరు చెప్పారు? నాకే ఆశ్చర్యంగా ఉందంటూ రాసుకొచింది. ఇదంతా చూసిన తర్వాత నిజంగానే అలాగే చేయాలని అనిపిస్తుందని, ప్రొడ్యూసర్లు ఎందుకు ఇంత రెమ్యూనరేషన్ పెంచావని అడిగితే.. మీడియా అలాగే చెబుతోంది సార్, వాళ్ళు చెప్పిన దానిని నేను నిజం చేయాలి కదా.
నేనేం చేయగలను అంటూ”.. కాస్త ఫన్నీగా కౌంటర్ ఇచ్చింది రష్మిక. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న పుష్ప-2, ది గర్ల్స్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాలు ఫలితాలను బట్టి మళ్ళీ రెమ్యునరేషన్ పెంచే ఛాన్స్ ఉందంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా పూజా హెగ్దే, అనుష్క, సమంత వంటి స్టార్ హీరోయిన్లు సైతం సినిమాకు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఈ సమయంలో.. రష్మిక రెమ్యునరేషన్పై వస్తున్న గాసిప్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.