RCB Team: ఐపీఎల్ ప్రారంభం కాగానే నెట్టింట ట్రెండ్ అయ్యే వార్తల్లో ముఖ్యంగా ఈ లైన్( ఈ సాలా కప్ నంబే) వినిపిస్తుంది. ఇప్పటివరకు కప్ అనే కల తీరనప్పటికీ బెంగళూరు రాయ్ ఛాలెంజర్స్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అంత క్రేజ్, ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్, జట్టు నిండా సమర్థులైన ఆటగాళ్లు ఇలా అన్ని ఉన్నా ఛాంపియన్గా కప్ చేజిక్కించుకోవడం ఒక్కటి మిగిలిపోయింది.
ఈ ఏడాది ప్రదర్శన చూస్తే మళ్లీ కప్పై ఆశలు సన్నగిల్లేటట్లు ఉన్నాయి. ఈ సీజన్ మొదలై ఇప్పటికే 10 రోజులు దాటింది. ఆర్సీబీ నాలుగు మ్యాచులు ఆడగా అందులో మూడు ఓటములను చూవిచూసింది. ముఖ్యంగా సొంతమైదానంలో వరుసగా రెండో మ్యాచ్ పరాజయం పాలవడం ఆర్సీబీ యాజమాన్యంతో పాటు అభిమానులను కూడా కలవరపెడుతోంది. మరి ఈ ఓటములకు ప్రధాన కారణలను చూస్తే..
బ్యాటింగ్ లైనప్ బాగున్నా.. అది ఇబ్బందిపెడుతోంది
RCB బ్యాటింగ్ పరంగా కోహ్లీ, డూ ప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్, దినేష్ కార్తీక్ వంటి ప్లేయర్స్తో స్ట్రాంగ్ టీంగా కనిపిస్తుంది. అయితే ఓపనర్లు తక్కువ స్కోరుకు ఔటైతే తర్వాత వచ్చే ఆటగాళ్లు 10 లేదా 15 పరుగులు కొడుతున్నారు తప్ప జట్టుకు అవసరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం లేదు. అందుకే నాలుగు మ్యాచులలో ఒకటి గెలిచింది. అది కూడా చివర్లో వచ్చిన దినేష్ కర్తీక్ బౌండరీలు బాదడంతో గెలిచి ఖాతా తెరిచింది ఆర్సీబీ (RCB Team).
ఫాఫ్ డు ప్లెసిస్ పేలవ ప్రదర్శన
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యాడు. అంతేకాకుండా కెప్టెన్గా కూడా సరైన నిర్ణయాలను తీసుకోలేక మ్యాచ్లను ప్రత్యర్థులకు అప్పగిస్తున్నాడు. ఇది రాయల్ ఛాలెంజర్స్ను చాలా బాధిస్తోంది. ఆటగాడిగా అతని ప్రదర్శన చూస్తే.. మూడు మ్యాచ్ల్లో అతను 127.78 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు మాత్రమే చేశాడు. ఏ జట్టుకైనా ఓపనింగ్ అనేది చాలా కీలకమనే చెప్పాలి. అలాంటిది గత మ్యాచుల్లో ఆర్సీబీ చెప్పుకోదగ్గ ఓపనింగ్ భాగస్వామ్యం రాలేదన్న సంగతి తెలిసిందే.
బౌలింగ్ కూడా అంతంత మాత్రమే
ఆర్సీబీ బ్యాటింగ్లో భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ పరంగా ధారాళంగా పరుగులు ఇవ్వడం ప్రతీ సీజన్లో ఈ సీన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా అదే సమస్య మళ్లీ బెంగళూరు జట్టుని వెంటాడుతోంది. లక్నోతో జరిగినా మ్యాచ్పై పట్టు సాధించారు అనుకోలేపే మళ్లీ మొదటికి వచ్చారు. మ్యాచ్లో కీలక చివరి ఓవర్లో బ్యాటర్లను కట్టడి చేయాల్సింది పోయి బాదించుకున్నారు. అదే బెంగళూరు కొంపముంచింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కూడా 180 లాంటి భారీ స్కోరు చేసిన ఆర్సీబీ.. సెకండ్ ఇన్నింగ్స్లో పేలవ బౌలింగ్ కారణంగా కేకేఆర్ బ్యాటర్లు పరుగులు పిండుకున్నారు. ఇప్పటికైనా బౌలింగ్పై కసరత్తులు చేయకపోతే బెంగళూరు పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందనే క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.