India vs England: హైదరాబాద్ వేదికగా ఉత్కంఠంగా సాగిన తొలి టెస్ట్ లో విజయం దిశగా భారత్ అడుగులు వేసిన.. చివరకు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. నాలుగు రోజుల పాటు జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ అనూహ్యంగా రేసులో అధిపత్యాన్ని చలాయించి విజయాన్ని తన సొంతం చేసుకుంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. 231 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక.. ఇంగ్లాండ్ స్పిన్నర్ల దాటికి 202 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఓటమి స్పందించాడు.
గెలుపు నుంచి ఓటమి.. అసలేం జరిగింది
231 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన భారత్ 202 పరుగులకే వెనుదిరిగింది. ఇక స్కోర్లు చూసినట్లయితే రోహిత్ శర్మ-39, కేఎస్ భారత్- 28, అశ్విన్-28 సాధించి అత్యధిక స్కోరర్లుగా నిలిచారు. ఎవరు ఊహించని విధంగా ఇంగ్లాండ్ బౌలర్లలోని టామ్ హార్ట్లీ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో ఉప్పల్ మైదానం వేదికగా భారత్ కు ఇదే తొలి పరాజయం.
(( దీనిపై ఓ లుక్కేయండి : హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. ఒకే సారి ముగ్గురు! ))
ఈ ఓటమితో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభంకానుంది. మ్యాచ్ అనంతరం తమ పరాజయం పై రోహిత్ శర్మ స్పందించాడు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పలేను కానీ.. జట్టుగా విఫలమయ్యామని మాత్రం చెప్పగలమని రోహిత్ వ్యాఖ్యానించారు.
అదే మా ఓటమికి కారణం
తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ జట్టు కిష్ల పరిస్థితుల్లో విదేశీ ప్లేయర్ ఓలీ పోప్ సూపర్ ఇన్నింగ్స్ చేశాడంటూ రోహిత్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుపుకి ప్రధాన కారణం పోప్ అంటూ పేర్కొన్నాడు. మ్యాచ్ నాలుగవ ఇన్నింగ్స్ లో తాము చేసిన బ్యాటింగ్ విజయానికి సరిపోలేదని.. తమ బౌలర్లు ప్రణాళికలను ఎంత తెలివిగా అమలు చేసినప్పటికీ, పోపు బ్యాటింగ్ అసాధారణం అంటూ చెప్పుకొచ్చాడు.
తొలి టెస్టు మొదటి మ్యాచ్ నుంచి భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 5 మ్యాచ్ ల సిరీస్ లో బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ 1-10 ఆధిక్యన్ని సంపాదించుకుంది. నాలుగవ రోజు 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, సెకండ్ ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లతో దుమ్ములేపాడు.
భారత్ లో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే తన సత్తా చాటాడు. ఒకటి కాదు రెండు కాదు ఎవరు ఊహించని విధంగా ఏడు వికెట్లు తీసి భారత్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. రెండు టెస్టులో తొలి మ్యాచ్లో జరిగిన తప్పులను సవరించుకుని గెలుపుతో బోణి కొట్టాలని రోహిత్ సేన భావిస్తోంది.