T20 World Cup 2024.. క్రికెట్ను మతంగా భావించే మన దేశంలో టీ20 ఫార్మాట్కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఏ మూలలో భారత జట్టు బరిలోకి దిగుతున్నా.. అభిమానులు బ్రహ్మరథం పట్టడం పరిపాటే. మరి అలాంటిది వరల్డ్కప్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. పుష్కర కాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న టీమిండియాకు మరో చక్కటి అవకాశం! నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ చివరి మెట్టుపై బోల్తా కొట్టిన భారత జట్టు.. పొట్టి ఫార్మాట్లోనైనా ప్రపంచ చాంపియన్గా నిలవాలని భావిస్తోంది. అప్పుడెప్పుడో టీ20 క్రికెట్ పెద్దగా జనాదరణ పొందని సమయంలో 2007లో తొలిసారి నిర్వహించిన వరల్డ్కప్లో విజేతగా నిలిచిన టీమిండియా ఆ తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ కప్పు కొల్లగొట్టలేకపోయింది. మరి నేటి నుంచి ప్రారంభం కానున్న తొమ్మిదోఎడిషన్లోనైనా రోహిత్ సేన కల నెరవేరుతుందా, కరువు తీరుతుందా చూడాలి!
T20 World Cup 2024: అవి చాలా డేంజరస్.. ఆ మూడింటితో ముప్పే!
వేసవి సెలవుల్లో ఐపీఎల్ను ఆస్వా దించిన అభిమానులకు ఇకపై విశ్వసమరం మజాను పంచనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తొమ్మిదో టీ20 ప్రపంచకప్ ఇప్పటికే ప్రారంభమైంది. తొలి రోజు ఆతిథ్య అమెరికా, వెస్టిండీస్లు విజయాలతో శుభారంభం చేశాయి. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ మెగాటోర్నీలో 20 జట్లు నాలుగు గ్రూప్లుగా తలపడనున్నా యి. దాయాది పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడాతో కలిసి గ్రూప్ ఉన్న టీమిండియా బుధవారం జరగనున్న తమ తొలి పోరులో ఐర్లాండ్తో కప్పు వేటను ప్రారంభించనుంది. ఐపీఎల్లో సహచరులే ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోగా.. ఇప్పుడు జట్టంతా కలిసి నీలిరంగులో సత్తాచాటేందుకు సమయాత్తమవు తోంది. ఐపీఎల్ చివరి దశలోనే అమెరికా చేరుకున్న భారత ఆటగాళ్లు న్యూయా ర్క్ పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ప్రాక్టీస్ సెషన్లలో నూ పాల్గొన్నారు.
బంగ్లాదేశ్తో ఏకైక వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడ్డ టీమిండియా.. మూడు రోజుల విరామం అనంతరం అసలు పోరుకు సిద్ధం కానుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో పంత్, పాండ్యాలు రాణించడం శుభసూచకం. బౌలింగ్ విభాగం కూడా మంచి ప్రదర్శనే చేసింది. 2007 నుంచి భారత జట్టులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మకు దాదాపు ఇదే చివరి ప్రపంచకప్ కాగా.. చాన్నాళ్లుగా పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా వచ్చే ఎడిసన్లో దర్శనమిచ్చే అవకాశాలు తక్కువే. అనిశ్చితికి మారుపేరైన టీ20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి జట్లను దాటుకొని ముందంజ వేయడం కష్టమై న పనే అయినా.. ఈసారి కప్పు కొట్టాలనే లక్షంతోనే రోహిత్ సేన ముమ్మర సాధన చేస్తోంది.