Airtel Hikes Two Plans For Prepaid Users: ప్రస్తుతం పర్స్ లేకుండా అయినా ప్రజలు బయటకు వెళ్తున్నారు గానీ జేబులో సెల్ఫోన్ లేకపోతే మాత్రం అడుగుపెట్టడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. అయితే మధ్య మధ్యలో టెలికాం కంపెనీలు టారీఫ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా పేరొందిన ఎయిర్టెల్ తమ ప్రీ పెయిడ్ యూజర్లకు గట్టి షాకిచ్చింది.
(( దీనిపై ఓ లుక్కేయండి: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు! ))
గతంలో కస్టమర్లకు అందిస్తున్న రెండు ప్లాన్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ముందున్న ప్రయోజనాలే అందిస్తూ ఛార్జీలు మాత్రం పెంచేసింది. ఈ కొత్త ప్లాన్ కథేంటో, వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రెండు ప్లాన్ల ధరలు పెరిగాయ్!
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ. 118, రూ. 289 ప్లాన్లో ఉండేవి. అయితే తాజాగా రెండు ప్లాన్లు ప్రవేశపెట్టడంతో ఈ రెండు ప్లాన్లను తొలగించి వీటి స్థానంలో రూ. 129, రూ. 329 అందించనుంది.
రూ. 118 నుంచి రూ. 129కి జంప్
ఇకపై ఎయిర్టెల్ యూజర్లు రూ. 118 ప్రీపెయిడ్ ప్లాన్ బదులుగా రూ. 129 కి చెల్లించాల్సి ఉంటుంది . ఈ ప్లాన్ ద్వారా 12 జీబీ డేటా వస్తుంది. ఇందులో ఇతర ప్రయోజనాలు ఉండవు. అయితే ఈ డేటాను కస్లమర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత యాక్టివ్ ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వేరే ప్లాన్ యాక్టివ్గా ఉన్న కస్టమర్లు.. కేవలం డేటా కోసం రూ. 129 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో రూ. 118 ప్లాన్ తో ఒక్క జీబీ డేటాకు రూ. 9.83 కాగా ప్రస్తుతం రూ. 129 ప్లాన్ తో ఒక్క జీబీకి రూ. 10.75 చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 289 నుంచి రూ. 329 కి పెరిగింది
కొత్తగా వచ్చిన రూ. 329 ప్లాన్లో వ్యాలిడిటీ 35 రోజులు. ఇందులో యూజర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 300 ఎస్ఎంఎస్ లు, 4 జీబీ డేటా అందించనున్నారు. వీటితో పాటు అదనంగా ఎయిర్టెల్ థ్యాంక్స్ కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ జాబితాలో అపోలో 24/7 సర్కిల్ ఉచిత సబ్ స్క్రిప్షన్, ఫ్రీ హల్లో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటివి ఫ్రీగా వస్తాయి. గతంలో రూ. 289 ఉన్నప్పుడు రోజుకు రూ. 8.25 ఖర్చు కాగా ప్రస్తుతం రూ. 329కి పెంపు అనంతరం రోజుకు రూ. 9.4 కు పెరిగింది.
అంతేకాకుండా ఎయిర్ టెల్ సిమ్ కార్డు యాక్టివ్గా పనిచేయాలంటే ప్రీపెయిడ్ వినియోగదారులు కచ్చితంగా రూ. 155 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. రూ. 99 ప్లాన్ ను 2022 నుంచి దశల వారీగా తొలగించింది. ఎయిర్టెల్ నవంబర్ 2022 నుండి రూ.99 ప్లాన్ను తొలగించింది, మొదటగా ఈ తొలగింపు ఒడిశా హర్యానాలో ప్రారంభించి తరువాత జనవరి 2023 నాటికి ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఈశాన్య, కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ (పశ్చిమ) వంటి ఇతర ప్రాంతాలలో అమలు చేసింది. కంపెనీల రాబడి, మార్జిన్లపై ఒత్తిడి పెరగడమే టారిఫ్ల పెంపునకు కారణమని సమాచారం.